T20 League : ‘బుల్లెట్’ బంతుల సవాల్ .. తిరుగులేని హైదరాబాద్ బౌలర్
బ్యాటర్ ఊహకు అందకుండా బంతిని సంధించడం ఓ కళ.. అయితే ఒక్కో బౌలర్...
145 కి.మీకిపైగా వేగంతో విసిరిన వీరులు వీరే!
ఇంటర్నెట్ డెస్క్ : బ్యాటర్ ఊహకు అందకుండా బంతిని సంధించడం ఓ కళ.. అయితే ఒక్కో బౌలర్ విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కొందరు స్లో, మీడియం పేస్తో బౌలింగ్ చేస్తే.. మరికొందరు బుల్లెట్లా దూసుకొచ్చే బంతులను సంధిస్తారు. ఇలా నిలకడగా గంటకు 145 కి.మీకిపైగా వేగంతో బంతిని విసిరే బౌలర్లపై ఓ లుక్కేద్దాం..
సాధారణంగా చాలా మంది బౌలర్లు 130 కి.మీ నుంచి 140 కి.మీ వేగంతో బంతిని వేస్తుంటారు. వీరిని మీడియం పేసర్లుగా పేర్కొంటారు. అయితే నిలకడగా గంటకు 145 కి.మీ స్పీడ్తో బంతులను సంధించే సూపర్ ఫాస్ట్బౌలర్లూ టీ20 లీగ్లో ఉన్నారు. ఇలాంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే కచ్చితంగా బ్యాటర్లు కష్టపడాల్సిందే. కాస్త అవకాశం ఇచ్చారో వికెట్ చేజారినట్లే. మరీ ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్, లాకీ ఫెర్గూసన్ వంటి స్పీడెస్టర్లను జాగ్రత్తగా కాచుకోవాల్సి ఉంటుంది. పరుగులు ఇచ్చినా వికెట్లను పడగొట్టడంలో ముందుంటారు.
ప్రతి లక్ష.. అతడి ఖాతాలోనే
(Photo: Umran Malik Instagram)
టీ20 లీగ్లో ప్రతి మ్యాచ్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్కు రూ. లక్ష నజరానాగా నిర్వాహకులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఆ జట్టు బౌలర్ ఉమ్రాన్ మాలిక్నే రూ. లక్ష వరించింది. దీంతో మ్యాచ్కు ముందే ఆ ‘లక్ష’ ఏదో ఉమ్రాన్ కోసం పక్కన పెడితే సరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంటే.. ఉమ్రాన్ బౌలింగ్ స్పీడ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు టీ20 లీగ్లో గంటకు 145 కి.మీకిపైగా వేగంతో దాదాపు 58 బంతులను సంధించాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సీజన్లో ఉమ్రాన్ మాలిక్ అత్యధిక వేగవంతమైన బంతి 153 కి.మీ. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో విసిరాడు.
యువ బౌలర్.. కుల్దీప్ సేన్
రూ. 20 లక్షలకు రాజస్థాన్ సొంతం చేసుకున్న యువ ప్లేయర్ కుల్దీప్ సేన్ ఈ సీజన్లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లను మాత్రమే ఆడాడు. మొత్తం 48 బంతుల్లో తొమ్మిది సార్లు గంటకు 145 కి.మీకిపైగా వేగంతో సంధించడం విశేషం. లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో 15 పరుగులను కాపాడి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతి అత్యధిక వేగవంతమైన బంతి 146.3 కి.మీ. అదీనూ లఖ్నవూ ఓపెనర్ డికాక్కు విసిరాడు.
లాకీ.. 150 కి.మీ తాకి..
(Photo: Lockie Ferguson Instagram)
లాకీ ఫెర్గూసన్.. గుజరాత్ జట్టులో కీలక బౌలర్.. గత సీజన్లో కోల్కతా ఫైనల్కు చేరడంలో ముఖ్య భూమిక పోషించాడు. అందుకేనేమో లాకీని గుజరాత్ మెగా వేలంలో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. నిలకడగా 145 కి.మీకిపైగా వేగంతో బంతులను సంధిస్తున్నాడు. ఇదే వేగంతో ఇప్పటివరకు 30 బంతులను విసిరడం విశేషం. అలానే స్లో డెలివరీలతో వికెట్లనూ కొల్లగొడుతున్నాడు. ఈ సీజన్లో 150 కి.మీ వేగంతో కూడా బంతిని విసిరాడు.
రాజస్థాన్ ఓపెనింగ్ బౌలర్..
ఓ మోస్తరు ఎకానమీతో (8.15) రాజస్థాన్ పేస్ బౌలింగ్ను నడిపిస్తున్న బౌలర్ ప్రసిధ్ కృష్ణ. ఇప్పటివరకు దాదాపు 20 ఓవర్లు వేసిన ప్రసిధ్ కేవలం 163 పరుగులే ఇవ్వడం గమనార్హం. పవర్ప్లేలో ఫీల్డర్ల అడ్వాంటేజ్ తీసుకొని మరీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటారు. అలాటి సమయంలోనూ కట్టడిగా ప్రసిధ్ బౌలింగ్ వేశాడు. ఈ సీజన్లో గంటకు 145 కి.మీకిపైగా వేగంతో మూడు బంతులను సంధించాడు.
సిరాజ్కూడానూ ఓ నాలుగుసార్లు..
(Photo: Mohammed Siraj Instagram)
బెంగళూరు విజయాల్లో సిరాజ్ది కీలక పాత్ర. పేస్ బౌలర్గా బౌలింగ్ దాడిని నడిపిస్తున్న సిరాజ్ ఎక్కువగా 140 కి.మీ వేగంతో బంతులను సంధిస్తాడు. ఇదే క్రమంలో 145 కి.మీ కంటే అధిక వేగంతో కూడానూ మూడు బంతులను విసిరాడు. సిరాజ్ ఫాస్టెస్ట్ బాల్ 145.97 కి.మీ. ప్రస్తుత సీజన్లో ఐదు మ్యాచులకుగాను 120 బంతులను విసిరిన సిరాజ్ కేవలం మూడు వికెట్లను మాత్రమే తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 2/59. ఎకానమీ (10.75) కూడా ఎక్కువగా ఉంది.
వీరు కూడా స్పెషలే..
రాజస్థాన్ బౌలర్ నవ్దీప్ సైని ఈ సీజన్లో ఆడింది రెండే మ్యాచ్లు. కానీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే గాయం కారణంగా ప్రస్తుతం బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. పరుగులు భారీగా ఇచ్చినా కీలకమైన వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో నవ్దీప్ సైని 149 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. అలానే పంజాబ్కు చెందిన ఓడియన్ స్మిత్ కూడానూ 148 కి.మీ వేగంతో అత్యంత స్పీడ్ బంతిని విసిరాడు. దిల్లీ యువబౌలర్ నాగర్కోటి 145.8 కి.మీ స్పీడ్తో బంతిని సంధించి ఔరా అనిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ