Rewind 2021: ధావన్ నట విశ్వరూపం.. డేవిడ్ భాయ్ అడ్డా.. చాహల్ పెళ్లి వీడియో!
భారత్లో సినీతారలకు సమానంగా క్రికెటర్లకూ అభిమానులున్నారు. అందుకే వారికి చేరువ అయ్యేందుకు కొంతమంది క్రికెటర్లు సోషల్మీడియాను వేదికగా చేసుకున్నారు. అప్పుడప్పుడు సరదా పోస్టులు పెడుతూ అభిమానులతోపాటు.. నెటిజన్లందరినీ ఆకట్టుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో
ఈ ఏడాదిలో ట్వీట్లు, ఇన్స్టా వీడియోలతో ఆకట్టుకున్న క్రికెటర్లు
భారత్లో సినీతారల కంటే క్రికెటర్లకే ఆదరణ ఎక్కువ. వారి సోషల్ మీడియా ఖాతాలను లక్షలు.. కోట్ల మంది నెటిజన్లు ఫాలో అవుతుంటారు. అయితే, కొంతమంది క్రికెటర్లు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. అప్పుడప్పుడు సరదా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. కాగా.. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో నెటిజన్లను బాగా ఆకట్టుకున్న క్రికెటర్ల పోస్టులేవో ఓ లుక్కెద్దామా?
తండ్రిగా కోహ్లీ తొలి ట్వీట్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క జంటకు జనవరి 11న కుమార్తె జన్మించింది. ఈ శుభవార్తను వెల్లడిస్తూ కోహ్లీ చేసిన ట్వీట్కు నెటిజన్లు లైకుల వర్షం కురిపించారు. దీంతో 2021లో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్గా నిలిచింది. అలాగే ఐపీఎల్ టోర్నీలో ధోనిపై కోహ్లీ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్లో భాగంగా అక్టోబర్ 10న దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్కింగ్స్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చివర్లో బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని.. మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఉత్కంఠ పోరులో తనదైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ చూసిన విరాట్ కోహ్లీ.. ‘కింగ్ ఈజ్ బ్యాక్.. క్రికెట్లో అతిగొప్ప ఫినిషర్. మరోసారి నన్ను ఆనందంతో గెంతులేసేలా చేశాడు’ అని ట్వీట్ చేశాడు
పాట్ కమిన్స్ దాతృత్వం
కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కు అండగా నిలిచేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ ఏప్రిల్ నెలలో పీఎం కేర్స్కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటించారు. ఆ సందర్భంగా పెట్టిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
శార్దూల్ను ట్రోల్ చేసిన రోహిత్ శర్మ
భారత క్రికెటర్లు.. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. అయితే, అందులో శార్దూల్ను ట్రోల్ చేస్తూ రోహిత్ డిసెంబర్ 6న ఇన్స్టాలో ఆ డాన్స్ వీడియోను పోస్టు చేశాడు. శార్దూల్ ఏం చేశాడో ఈ వీడియోలో మీరే చూడండి..
డేవిడ్ భాయ్ అడ్డా..
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించిన డేవిడ్ భాయ్.. అదేనండీ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని పాటలకు డేవిడ్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబసభ్యులతోనూ స్టెప్పులేయిస్తుంటారు. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాటతో మొదలు పెట్టి.. అనేక తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ.. డైలాగులు చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రంలోని ‘మైండ్ బ్లాకు’ పాటకు సతీమేతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’ పాటకు ఫేస్యాప్ ద్వారా తన ముఖాన్ని జోడించి వీడియో రూపొందించారు. ఇదిగోండి ఆ వీడియోలు..
టీ20 ప్రపంచకప్లో భారత్ ప్రదర్శనపై సెహ్వాగ్ సెటైర్లు...
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో తనదైన శైలిలో ట్వీట్లు చేస్తుంటారు. టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ కూడా బాగా వైరల్ అయింది. అక్టోబర్-నవంబర్ మధ్య జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఆ సమయంలో భారత్ పరిస్థితి ఇదంటూ.. వీరేంద్ర సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఓ సభలో ‘ఖతం.. బై బై.. టాటా.. గుడ్బై’ అని చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన ఓ మీమ్ను జతచేశారు.
బిల్లీ బౌడెన్ మీరేమంటారు..?
క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్ పాత్ర చాలా కీలకం. వేసే ప్రతి బంతిని పరిశీలించాలి. ఫలితాలన్ని చేతులతో సంజ్ఞ చేసి చూపించాలి. అయితే, న్యూజిలాండ్కు చెందిన బిల్లి బౌడెన్ మాత్రం ఎంపైరింగ్లో అప్పుడప్పుడు సరదా విన్యాసాలు చేస్తుంటారు. బంతి వైడ్ వెళ్లినా, బౌండరీ దాటినా, వికెట్ పడినా చిత్రవిచిత్ర భంగిమలతో ప్రకటిస్తుంటారు. అయితే, ఈ మధ్య భారత్లో జరిగిన ఓ దేశవాలీ క్రికెట్ మ్యాచ్లో బంతి వైడ్ పడగానే.. ఎంపైర్ తలకిందులుగా నిలబడి కాళ్లతో వైడ్ సంజ్ఞ చేశాడు. ఆ వీడియో వైరల్ కాగా.. అది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దృష్టికి చేరింది. దీంతో ఆ వీడియోని ట్వీట్ చేసిన సచిన్.. బిల్లి బౌడెన్ దీనిపై మీ అభిప్రాయమేంటని అడిగారు. ఆ వీడియో.. సచిన్ ట్వీట్ రెండూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
శిఖర్ ధావన్.. క్రికెటర్ మాత్రమే కాదు.. నటుడు, సంగీత కళాకారుడు
భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ బ్యాటు పట్టుకొని పరుగులు రాబట్టడమే కాదు.. ఫ్లూట్ వాయిస్తూ చక్కటి సంగీతం కూడా వినిపించగలడు. ఆయనలో ఉన్న ఈ టాలెంట్ను తరచూ బయటపెడుతుంటాడు. జులై నెలలో మరో భారత క్రికెటర్ పృథ్వీషా పాట పడగా.. ధావన్ ఫ్లూట్ వాయించాడు. ఆ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయగా.. లక్షల మంది వీక్షించారు. తాజాగా ‘షోలే’ చిత్రంలో విలన్ గబ్బర్సింగ్ చెప్పే ‘కితినే ఆద్మీ థే’ డైలాగును ధావన్ రిక్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.
చాహల్ పెళ్లి వీడియో చూశారా!
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంటాడు. తోటి ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తూ.. ఆటపట్టిస్తూ సరదా వీడియోలు రూపొందించి ఇన్స్టాలో పోస్టు చేస్తుంటాడు. డాక్టర్ ధనుశ్రీ వర్మను చాహల్ గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. వారి పెళ్లి వీడియోను ఈ ఏడాది మార్చిలో ఇన్స్టాగ్రామ్లో విడుదల చేశాడు. ఆ పెళ్లికి శిఖర్ ధావన్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఆ వీడియోను 38లక్షలకుపైగా నెటిజన్లు వీక్షించారు.
ఇల్లు కొనాలి.. ఎక్కడైతే బాగుంటుంది?
భారత్ యువక్రికెటర్ రిషభ్ పంత్ దృష్టి అంతా ఇప్పుడు టీమిండియాలో స్థిరమైన స్థానం సంపాదించడంపైనే ఉంది. సోషల్మీడియాలోనూ మ్యాచ్లకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా ట్వీట్ చేస్తుంటాడు. అయితే, జనవరి నెలలో చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అయింది. ‘నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. మా కుటుంబసభ్యులు కొత్త ఇల్లు తీసుకోమని వెంటపడుతున్నారు. మరి ఉండటానికి గురుగ్రామ్ సరైనదేనా? వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి’అని ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్కు ఓ అమ్మాయి స్పందిస్తూ ‘నా హృదయంలో ఉంటే అద్దె కూడా ఉండదు. ఇంకో ఇంటితో పనేముంది’అని కామెంట్ చేసింది. ‘దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఇల్లు తీసుకోవాలని అనుకుంటే.. మెట్రో స్టేషన్ సమీపంలోనే తీసుకోండి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మరో పదేళ్లపాటు మీరు ఏడాదికి 250 రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. కాబట్టి ఓ విమానం కొనుగోలు చేయండి. అందులోనే కుటుంబసభ్యుల కోసం గదులు ఉండేలా చూడండి. ఎయిర్పోర్టులో మీకు పార్కింగ్ కూడా లభిస్తుంది’అని మరో నెటిజన్ సరదాగా స్పందించారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!