Cricket - YouTube: యూట్యూబర్లుగా క్రికెటర్లు.. టాప్-10లో వీళ్లే!
తమ అభిప్రాయాలను నిర్భయంగా ఎదుటివారిని కించపరచకుండా తెలియజెప్పే...
క్రికెట్ మ్యాచ్పై విశ్లేషణ అంటే ఒకప్పుడు పత్రికలు లేదంటే టీవీలే. మ్యాచ్ అవ్వగానే క్రీడానిపుణులు ఏమన్నారు, ఆటను ఎలా విశ్లేషించారు అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చదివేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అందరూ యూట్యూబ్లోకి వెళ్లిపోతున్నారు. కారణం అక్కడ మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాల్ని కుండ బద్దలుకొడుతున్నట్లు చెబుతుండటమే. అలా ప్రస్తుతం చాలామంది మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు. వారి సంగతి ఓ సారి చూద్దామా!
క్రికెటర్గా కెరీర్ తక్కువే కానీ..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆటగాడిగా కంటే యూట్యూబర్గా ఎక్కువ పాపులారిటీ సాధించాడు. 2003-2004 సీజన్లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్కు ఆడిన చోప్రా కేవలం 10 టెస్టుల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో రెండు అర్ధశతకాలు సహా 23 సగటుతో 437 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 60 పరుగులు మాత్రమే. ఇక యూట్యూబ్లో ప్రతి అంశంపై స్పందించే వ్యక్తుల్లో ఆకాశ్ ముందుంటాడు. ఆకాశ్ చోప్రా పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ ఛానల్కు 3.17 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో భారీ ధరను దక్కించుకున్న ఆటగాళ్ల గురించి, జట్ల సామర్థ్యాలపై తనదైన శైలిలో విశ్లేషణలు అందించాడు ఆకాశ్ చోప్రా. 2011లో యూట్యూబ్ ఛానల్ను ఆకాశ్ ప్రారంభించాడు.
రెండో స్థానం రావల్పిండి ఎక్స్ప్రెస్దే
గతంలో భారత్, పాక్ వన్డే మ్యాచ్ అంటే సచిన్, సెహ్వాగ్తోపాటు షోయబ్ అక్తర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. టెస్టుల విషయానికొస్తే ద్రవిడ్-అక్తర్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండేది. బంతిని ఎంత స్పీడ్గా సంధిస్తాడో షోయబ్ అక్తర్ మాటలు కూడా అంతే సూటిగా ఉంటాయి. మూడేళ్ల కిందట (2019) యూట్యూట్ ఛానల్ను ప్రారంభించిన అక్తర్ అనతి కాలంలోనే మూడు మిలియన్ల (3.10 మిలియన్లు) సబ్స్క్రైబర్లను సాధించాడు. ఇటీవల తుది శ్వాస విడిచిన లతా మంగేష్కర్కు నివాళి అర్పిస్తూ విడుదల చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. భారత్, పాకిస్థాన్ జట్లతో సహా క్రికెట్కు సంబంధించి అప్డేట్లపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు.
రవిచంద్రన్ అశ్విన్.. సూపర్ యాక్టివ్
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో టీమ్ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే మాతృభాష తమిళంలోనే మాట్లాడేందుకు ఆసక్తి చూపుతాడు. ఇంగ్లిష్ సబ్టైటిల్స్ వేయడం వల్ల మిగతావారికి రీచ్ అవుతున్నాడు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా సినిమాలు, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపైనా తన ఛానల్లో చర్చిస్తుంటాడు. విరాట్ కోహ్లీ, కుమార్ సంగక్కర, గావస్కర్తో పాటు తమిళ నటులను సైతం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మీమ్స్తో కూడిన సరదా వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు. 2020లో ప్రారంభమైన అశ్విన్ యూట్యూబ్ ఛానల్కు ప్రస్తుతం 8.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
సెలెక్టివ్గా సచిన్ వీడియోలు
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. అయితే ముఖ్యమైన.. సెలెక్టివ్గా మాత్రమే తన ఛానల్లో వీడియోలను అప్లోడ్ చేస్తాడు. గతంలో తన బ్యాటింగ్, బౌలింగ్ అనుభవాలు, భారత బౌలింగ్ దాడి గురించి ప్రత్యేకంగా విశ్లేషించి అభిమానుల కోసం పెడుతుంటాడు. క్రికెట్ గురించి మాత్రమే కాకుండా ఇతర అంశాలనూ ప్రస్తావిస్తుంటాడు. రెండు నెలల కిందట బ్రేక్ఫాస్ట్గా మిసాల్ పావ్ తయారు చేసిన వీడియో దాదాపు 2.7 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. సచిన్ 100MB లోగోతో వీడియోలను చేస్తుంటాడు.
క్రికెట్ మాత్రమే కాకుండా..
పాకిస్థాన్ క్రికెట్ టీమ్లో హిందూ క్రికెటర్గా చోటు సంపాదించిన డానిష్ కనేరియా లెగ్ బ్రేక్ బౌలర్. పాక్ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు, వన్డేల్లో 18 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. పాక్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్ కావడం విశేషం. గుజరాత్కు చెందిన కనేరియా పూర్వీకులు కరాచీలో స్థిరపడ్డారు. 2010లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2019లో డానిష్ కనేరియా 261 పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించగా 3.63 లక్షల సబ్స్క్రైబర్లను సాధించాడు. కేవలం క్రికెట్కు సంబంధించిన అంశాలే కాకుండా హిందూ పండుగలు, వంటకాలు వంటి ఇతర వ్యాపకాలనూ వీడియోలుగా పెడుతుంటాడు. టీమ్ఇండియా, ఐపీఎల్, పాకిస్థాన్తో సహా ఇతర లీగ్ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనపై విశ్లేషణలు చేస్తుంటాడు.
భారత పర్యటనతోనే..
యాషెస్ సిరీస్లో ఆసీస్కు సారథ్యం వహించిన ప్యాట్ కమిన్స్.. వ్లాగ్స్తో అభిమానులకు చేరువగా ఉంటాడు. ఆఫ్బీట్ కంటెంట్తో వీడియోలను రూపొందించి షేర్ చేస్తుంటాడు. అందుకే కేవలం పది నెలలకే దాదాపు రెండు లక్షల సబ్స్క్రైబర్లను రాబట్టగలిగాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఆసీస్ నుంచి భారత్కు ప్రయాణించిన వీడియోను మొదటిసారి తన యూట్యూబ్లో ఉంచాడు. ఈ వీడియో దాదాపు ఒక మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు చేసిన వీడియోల్లోకెల్లా ఇదే అత్యధిక వీక్షణలను పొందినది కావడం విశేషం. అలానే నాలుగు నెలల కిందట తండ్రైన ప్యాట్ కమిన్స్ తన చిన్నారితో కలిసి వీడియోను పెట్టాడు.
సూటిగా చెప్పడంలో స్పెషలిస్ట్
గతేడాది టీ20 ప్రపంచకప్ పోటీల్లో టీమ్ఇండియాపై పాక్ గెలిస్తే తమ దేశ క్రికెట్ బోర్డులో భారీ పెట్టుబడి పెట్టేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి గుర్తు ఉండే ఉంటాడు. అతడే పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా. ఈయనా ఓ యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు.. చాలా టీవీ ఛానళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూటిగా, స్పష్టంగా ఉన్న విషయాన్ని చెప్పేందుకు వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు. 2018లో ప్రారంభించిన రమీజ్ రజా యూట్యూబ్ ఛానల్కు ప్రస్తుతం 1.64 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. చివరిసారిగా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయిన వీడియోను మూడు నెలల క్రితం రమీజ్ రజా అప్లోడ్ చేశాడు.
ఇంజమామ్ మాటల షాట్లు
పాకిస్థాన్ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. సచిన్ తరం దిగ్గజాల్లో ఇంజమామ్ ఒకడు. పాక్ తరఫున ఆడేటప్పుడు జట్టు సభ్యులతో మాట్లాడేందుకు కూడా సిగ్గు పడే ఇంజమామ్ విశ్లేషకుడిగా మారతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆట పట్ల పూర్తి పరిజ్ఞానం ఉన్న ఇంజమామ్ 2019లో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. 3.70 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. క్రికెటర్ల ప్రదర్శన, టీమ్ల ఎంపిక తదితర విషయాలపై లోతైన వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. అదే విధంగా క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లు, జట్లతో సహా ఎవరినీ కించపరిచేలా, విమర్శించేలా మాట్లాడడు. తన భావాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాడని ఇంజమామ్కు పేరుంది.
మనోళ్లనే తిట్టి నిషేధానికి గురై..
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఏడు టెస్టులు, 123 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టీమ్ఇండియాపై టెస్టు సిరీస్ సందర్భంగా అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే, వైస్ కెప్టెన్ ఎంఎస్ ధోనీలపై అసభ్య పదజాలం వాడినట్లు నిరూపణ కావడంతో రెండు టెస్టుల నిషేధం పడింది. అయితే అప్పట్లో సంచలనం సృష్టించినా తర్వాత ఐపీఎల్లోనూ నాలుగేళ్లపాటు హాగ్ ఆడటం విశేషం. దాదాపు అందరికంటే ముందుగానే యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇతగాడి యూట్యూబ్ ఛానల్కు 1.29 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఐపీఎల్, యాషెస్, టీ20 ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీల్లో విజయం ఎవరివైపు ఉందో అంచనాలు, విశ్లేషణలు చేస్తుంటాడు.
రోజూ యూట్యూబ్లో...
పన్నెండేళ్ల కిందట స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి సల్మాన్ భట్ ఉద్వాసనకు గురయ్యాడు. దీంతో క్రికెట్కు సంబంధించిన వ్యవహారాల్లో పాలుపంచుకోలేక పోయిన భట్.. నిషేధం తొలిగిపోవడంతో దేశవాళీ స్థాయిలో మాత్రమే ఆడగలిగాడు. మూడేళ్ల కిందట (2019) యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించిన సల్మాన్ .. దాయాది దేశాలతోపాటు గుర్తింపు పొందిన లీగ్లలో ఆటగాళ్ల ప్రదర్శనలపై విశ్లేషణలు చేస్తుంటాడు. రోజూ క్రికెట్కు సంబంధించి అభిమానుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు 85 వేలకుపైగా సబ్స్క్రైబర్లను సాధించాడు. ఇటీవల కాలంలో భారత్కు చెందిన ఆటగాళ్ల ప్రదర్శనపై పాజిటివ్ ధోరణిలో వీడియోలు అప్లోడ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి