Wrestlers Protest: ‘మాకు చెప్పకుండానే కమిటీ’..అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్లు
బ్రిజ్ భూషణ్(Brij Bhushan Sharan Singh)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు పర్యవేక్షక కమిటీ ఏర్పాటైంది. దీనిపై రెజ్లర్లు(wrestlers) స్పందించారు.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరపనున్న పర్యవేక్షక కమిటీకి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ ఏర్పాటుపై రెజ్లర్లు(wrestlers) వినేశ్ ఫొగాట్(Vinesh Phogat), బజ్రంగ్ పునియా(Bajrang Punia) అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా దీనిని ఏర్పాటు చేశారని ట్విటర్ వేదికగా స్పందించారు.
‘పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసే ముందు మమ్మల్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. కానీ అలా జరగకపోవడం బాధాకరం’ అని వినేశ్ ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను ట్యాగ్ చేశారు. బజ్రంగ్ పునియా కూడా ఇదేవిధంగా ట్వీట్ చేశారు.
ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ వచ్చే నెల రోజుల పాటు జాతీయ సమాఖ్య దైనందిన వ్యవహారాలు కూడా చూస్తుంది. రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండె, టాప్స్ మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజగోపాలన్, సాయ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమాన్ కమిటీలోని ఇతర సభ్యులు. బ్రిజ్ భూషణ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన కమిటీలో కూడా యోగేశ్వర్, మేరీకోమ్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.