IND vs SA: భారత్‌-దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి!

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారేలా ఉన్నాడు. లఖ్‌నవూ వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న మొదటి వన్డే వర్షం కారణంగా ఆలస్యం కానుంది. 

Updated : 06 Oct 2022 13:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్‌ సమయం ప్రకారం ఇప్పటికే టాస్‌ పడి మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తొలి వన్డేకు వేదిక లఖ్‌నవూలో వర్షం పడటంతో టాస్‌ను 1.30 గంటలకు మార్చారు. అయితే ఇంకా చినుకులు పడుతుండటంతో టాస్ కూడా వేయలేకపోయారు. దీంతో మ్యాచ్‌ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. 

ఇప్పటికే సఫారీలపై మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లకు భారత్‌ సారథిగా శిఖర్ ధావన్‌ వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో యువకులకు ఎక్కువగా అవకాశం కల్పించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని