ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరు
ఆసీస్ బౌలింగ్లో షాట్లు ఆడేందుకు జంకుతున్నాడని చెతేశ్వర్ పుజారాపై విమర్శలు. బౌలింగ్లో ఫర్వాలేదు కానీ బ్యాటుతో జట్టును ఆదుకోవడం లేదని రవిచంద్రన్ అశ్విన్పై రుసరుసలు. ఎక్స్-ఫ్యాక్టర్ సంగతి దేవుడెరుగు! అటు కీపింగ్ ఇటు బ్యాటింగ్ ప్రాథమిక అంశాల్లో ...
జ్వాలను రగిల్చిన పంత్, పుజారా, యాష్
‘‘క్రికెట్ జట్లలో పుజారా, పంత్, అశ్విన్ ప్రాముఖ్యం అందరికీ అర్థమైందనే అనుకుంటున్నా. టెస్టు క్రికెట్లో మూడో స్థానంలో దిగి నాణ్యమైన బౌలింగ్లో ప్రతిసారీ బంతిని బాదలేరు. ఊరికే 400 టెస్టు వికెట్లు అలా వచ్చేయవు - సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు’’
పుజారా.. టీమ్ఇండియా అదృష్టం
ఎన్నెన్ని మాటలు.. ఎన్నెన్ని అవమానాలు.. చెతేశ్వర్ పుజారా ఎదుర్కొన్న విమర్శలను చెప్పేందుకు మాటలు సరిపోవు! ‘ఆసీస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొనేందుకు అతడు జంకుతున్నాడు’, ‘కేవలం డిఫెన్స్కే పరిమితమై జట్టు ఓటమి పాలయ్యేందుకు కారకుడవుతున్నాడు’, ‘పరుగులు చేయకుండా క్రీజుకే పరిమితమై అవతలి ఎండ్లో సహచరుల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడు’, ‘ఇప్పుడు టెస్టు క్రికెట్ మారింది. అతడు తన ఆట మార్చుకోవాలి. స్ట్రైక్రేట్ పెంచుకోవాలి’.. నయావాల్పై మాటల దాడిది. అతడి డిఫెన్స్ విధానం తమకెంత చేటు చేసిందో ఆసీస్ మాజీలకు తెలియందా! గత పర్యటనలో అతడిదే విధానంతో కదా కంగారూల నడ్డి విరించింది. పరుగుల వరద పారించింది. భారత బౌలర్లు కాపాడకోగల లక్ష్యాలను నిర్దేశించింది. అతడి విలువ తెలుసుకాబట్టే ఆసీస్ మాజీలు ఆ మైండ్గేమ్కు తెరతీసింది. తెరవెనుక వ్యూహం తెలుసుకోని కొందరు భారతీయులు మాత్రం పుజారాపై విమర్శలు ఎక్కుపెట్టేశారు.
ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరితే కొత్త బంతిని ఎదుర్కొనేందుకు పుజారా వాడే టెక్నిక్ డిఫెన్స్. అది అతడి సహజశైలి. ఒకట్రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు చేయలేదని తన సహజశైలి ఎలా మార్చుకోగలడు? క్రికెట్ తెలిసిన ఎవ్వరైనా సొంత శైలిని వదుకోవాలని సూచించరు. ద్రవిడ్లాంటి దిగ్గజాలైతే అసలు బ్యాటింగ్ టెక్నిక్ గురించే బోధించరు. మానసికంగా నువ్వెంత దృఢంగా ఉన్నావన్నదే వారు బోధిస్తారు. పుజారా అందులో సిద్ధహస్తుడు కాబట్టే సిడ్నీ టెస్టుతో కెరీర్లో 6000 పరుగుల మైలురాయి దాటేశాడు. భారత్లో 11 మంది ఆ ఘనత సాధిస్తే అత్యంత వేగంగా సాధించిన ఆరో ఆటగాడతను. ఓపికలో తిరుగులేదు కాబట్టే సిడ్నీ రెండో ఇన్నింగ్స్లో 205 బంతులు ఆడాడు. దాదాపు మూడున్నర గంటలు క్రీజులో ఉన్నాడు. ఊరికే అతడు బంతుల్ని డిఫెండ్ చేస్తే 18 శతకాలు, 27 అర్ధశతకాలు చేయగలడా చెప్పండి! టీమ్ఇండియాకు ఎన్నో గెలుపుల్లో కీలకంగా నిలిచి.. మరెన్నో ఓటములను అడ్డుకొన్న ఈ యోధుడు భారత జట్టులో ఉండటమే ఓ అదృష్టం.
అశ్విన్.. టీమ్ఇండియా బలం
ఒకప్పుడు టీమ్ఇండియాకు శాశ్వత ఆటగాడైన రవిచంద్రన్ అశ్విన్కు రెండేళ్లుగా సరైన అవకాశాలే ఇవ్వడం లేదు. కొత్త ప్రతిభ రావడం ఒకటైతే ఫింగర్ స్పిన్నర్ల కన్నా మణికట్టు మాయగాళ్లే మెరుగన్న అపోహ మరొకటి. దాదాపుగా అతడిని సుదీర్ఘ ఫార్మాట్కే పరిమితం చేశారు. గతంలో ఆసీస్, న్యూజిలాండ్కు తీసుకెళ్లినా జట్టులో చోటివ్వలేదు. కొన్నిసార్లు జట్టు కూర్పు కుదరడం లేదు. మరికొన్ని సార్లేమో బ్యాటింగ్లో విఫలమవుతున్నాడని పక్కన పెట్టారు. కానీ కొత్త విషయాలు నేర్చుకొనేందుకు ఎంతగానో కష్టపడే యాష్ అవన్నీ మనసులోనే పెట్టుకొన్నాడు. తన అమ్ములపొదిలో మరిన్ని బౌలింగ్ అస్త్రాలు పెంచుకున్నాడు. బ్యాటింగ్ పరంగానూ అవకాశాల కోసం ఎదురుచూశాడు.
ఈ సిరీసులో మొదట అతడికి అదృష్టం కలిసిరాలేదు. కానీ సిడ్నీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం అతడు ఊరుకోలేదు. ముందురోజు విపరీతంగా బౌలింగ్ చేసి వెన్నునొప్పితోనే నిద్రపోయాడు. ఉదయం బూట్లు కట్టుకోలేకపోయిన అతడే దాదాపు మూడు గంటలు క్రీజులో వంగి ఆసీస్ బౌలర్లు వేసిన బంతుల్ని డిఫెండ్ చేశాడు. ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత కసి, ఎంత పట్టుదల ఉంటే ఇలా చేయగలడు. నిజానికి అతడు ఒక టెస్టులో 100+ బంతులు ఎదుర్కొని రెండేళ్లు గడిచిపోయింది. అయినా అతడు సిడ్నీలో 190 నిమిషాలు నిలబడి క్రీజులో లైయన్, కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్ వేసిన బంతుల్ని డిఫెండ్ చేశాడు. అందులో కొన్ని దేహానికి తగిలాయి. గాయాలైనా సరే మొక్కవోని దీక్షతో అతడు టీమ్ఇండియాను గట్టెక్కించాడు. అతడి అనుభవం విలువేంటో చాటిచెప్పాడు.
పంత్.. టీమ్ఇండియా ఆయుధం
భవిష్యత్తు ఎంఎస్ ధోనీ! ఇదీ రిషభ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పుడు వినిపించిన మాటలు. అందుకు తగ్గట్టే అతడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో శతకాలు బాదేశాడు. వెస్టిండీస్పై రెండుసార్లు 90+ స్కోరు వద్ద ఔటయ్యాడు. వేగంగా పరుగులు చేస్తూ వారెవ్వా అనిపించాడు. తొలి సిరీసులోనే ఎక్కువ క్యాచులు అందుకొని ధోనీ రికార్డులు బద్దలుకొట్టేశాడు. ఎక్స్ ఫ్యాక్టర్గా జట్టుకు తనెంతో విలువైన ఆటగాడినని చాటిచెప్పాడు. కానీ అదేంటో.. మహీతో పోలికల ఉచ్చులో పడి ఆటపై ఏకాగ్రత కోల్పోయాడు. కీపింగ్లో ప్రాథమిక అంశాల్లో విఫలమయ్యాడు. తనవైన బ్యాటింగ్ మెరుపులు మాయం అయ్యాయి. పదేపదే విఫలమై విమర్శల పాలయ్యాడు.
దాదాపుగా ఏడాదికాలం నుంచి పంత్కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దేశవాళీకి వెళ్లకతప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. అదృష్టవశాత్తు మళ్లీ తనకు అచ్చొచ్చిన ఆసీస్లో పంత్ మెరిశాడు. గత పర్యటనలో శతకం బాదేసిన సిడ్నీలో త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి బౌలింగ్ దాడిని తన వీరబాదుడుతో కకావికలం చేసేసి సమీకరణాన్ని భారత్కు అనుకూలంగా మార్చాడు. ఒత్తిడిలో విధ్వంసం సృష్టించగల సత్తా ఉంది కాబట్టే గంగూలీ, పాంటింగ్, కుంబ్లే, గంభీర్ వంటి మాజీలు జట్టులో అతడికి చోటివ్వాలని, ప్రోత్సహించాలని అంటుంటారు. సిడ్నీలో లైయన్ బౌలింగ్లో అతడు బాదిన బౌండరీలు, సిక్సర్లు దాదాపుగా ఆసీస్కు చెమటలు పట్టించాయి. పుజారాతో కలిసి పంత్ మరింత భాగస్వామ్యం అందజేసుంటే భారత్ కచ్చితంగా విజయం సాధించేదే. నిజానికి పంత్ విలువేంటో అందరికీ తెలుసు. అందుకే అతడికి అండదండలు లభిస్తాయి. కానీ అతడు చేయాల్సింది మాత్రం ఒక్కటే. తన విలువేంటో తానే గుర్తించడం.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం