Sania Mirza: అమెరికన్ షో.. సెరెనాపై ప్రశ్నకు వింతైన ఆప్షన్లు.. స్పందించిన సానియా
సెరెనా విలియమ్స్ (serena)కు సంబంధించిన ప్రశ్నకు ఇచ్చిన ఐచ్ఛికాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీశాయి. వాటికి సానియా మీర్జా (sania mirza) స్పందించడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగులో ‘మీలో ఎవరుకోటీశ్వరుడు?’.. హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ ఫేమస్ టెలివిజన్ షోలు.. హోస్ట్లు ప్రశ్నలు అడగటం.. పోటీకి వచ్చినవారు కరెక్ట్ సమాధానాలు చెప్పి ప్రైజ్మనీని గెలుచుకోవడం సర్వసాధారణం. అమెరికాలో ‘హూ వాంట్ టు బి ఏ మిలియనీర్?’ షో ఎంతో పాపులర్. అయితే పోటీకి వచ్చిన ఓ కంటెస్ట్కి షో నిర్వాహకులు ఆన్లైన్లో ప్రశ్నను సంధించారు. అప్పటి వరకు బానే ఉంది. కానీ హోస్ట్ ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలే సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
అమెరికన్ షోలో కంటెస్ట్కి ఇచ్చిన ప్రశ్న.. ‘‘ఈ క్రింది టెన్నిస్ దిగ్గజాల్లో ఎనిమిది వారాల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలిచింది ఎవరు..?’’.. దానికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్, రోజర్ ఫెదరర్, జాన్ ఎన్రో అంటూ ఐచ్ఛికాలను ఇచ్చారు. ఇక్కడే అసలైన తమాషా.. ఎందుకంటే సెరెనా విలియమ్స్ కాకుండా మిగతా ముగ్గురు పురుష ఆటగాళ్లు కావడం విశేషం. అయితే ఇది గతేడాది షో సందర్భంగా జరిగిందని పలువురు కామెంట్లు పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్పందించడంతో మరోసారి ట్రోలింగ్ జరిగింది. ‘‘చాలా కష్టమైన ప్రశ్న’ అంటూ సానియా ట్వీట్ చేసింది. అయితే అది స్క్రీన్షాట్ తీసి పెట్టారని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం కష్టమేనంటూ ఆటపట్టించారు. అయితే ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు కూడా కామెంట్లు వస్తున్నాయి. అయితే ఆ ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం సెరెనా విలియమ్స్. ఆమె 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ను సొంతం చేసుకొంది. అప్పుడు సెరెనా 8 వారాల గర్భవతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు