ఇది చాలా అన్యాయం: సెహ్వాగ్
క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మరవలేనిదిగా పంజాబ్×ముంబయి మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతోంది. మ్యాచ్తో పాటు సూపర్ ఓవర్ టై కావడం.. తర్వాత మరో సూపర్ ఓవర్ నిర్వహించడం..
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మరవలేనిదిగా పంజాబ్×ముంబయి మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతోంది. మ్యాచ్తో పాటు సూపర్ ఓవర్ టై కావడం.. తర్వాత మరో సూపర్ ఓవర్ నిర్వహించడం.. చివరికి ముంబయిపై పంజాబ్ విజేతగా నిలవడం తెలిసిందే. అయితే నరాలు తెగే ఉత్కంఠతో మునివేళ్ల మీద నిలబెట్టిన ఈ మ్యాచ్కు అభిమానులే కాదు, క్రీడా, సినీ ప్రముఖులు సైతం ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్పై టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. ‘‘ఒకే మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లా. ఇది చాలా అన్యాయం. అయితే 2020లో ఉత్తమమైనది ఈ టీ20 లీగే అని చెప్పడానికి ఇదే ఉదాహరణ’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరోవైపు యువీ.. ‘‘2019 ప్రపంచకప్ పైనల్? ముంబయి×పంజాబ్ మ్యాచ్?.. దీనిలో ఏది అత్యుత్తమ గేమ్? అద్భుత సంఘటనలు జరిగాయి. రెండు జట్లు గొప్ప పోరాట పటిమ చూపాయి. ముంబయి తరఫున గేమ్ ఛేంజర్ బుమ్రా అయితే పంజాబ్ వైపు కేఎల్ రాహుల్. ఇక యూనివర్సల్ బాస్ గేల్, మయాంక్ మ్యాచ్కు గొప్ప ముగింపునిచ్చారు’’ అని ట్వీటాడు.
పంజాబ్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా మ్యాచ్ ప్రభావంతో ఇప్పటికీ షాక్లోనే ఉన్నానని ట్వీట్ చేశారు. ‘‘చర్యలు.. మాటల కంటే బిగ్గరగా భావాన్ని తెలియజేస్తాయి. నా భావాన్ని మాటల్లో వర్ణించడంలో విఫలమయ్యా. రెండు సూపర్ ఓవర్లా!! ఇది ఊహించనిది. ఇప్పటికీ షాక్లోనే ఉన్నా. మా జట్టు సభ్యులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది. ఆహా.. ఆ ఫీలింగ్ ఎంతో బాగుంది. గొప్ప ప్రదర్శన చేసిన మా సుప్రీం టీమ్కు ధన్యవాదాలు. జట్టుగా పోరాడితే అత్యుత్తమ ఫలితమే వస్తుంది’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరు మ్యాచ్లోనూ ఆఖరి బంతికి పంజాబ్ విజయం సాధించిన సందర్భంలో ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్లను చివరి వరకు తెచ్చి ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెప్పించవద్దని జట్టును వేడుకుంటూ సరదాగా ట్వీట్ చేశారు. కానీ పంజాబ్ మరోసారి తీవ్ర ఉత్కంఠ పోరులోనే విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.