1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..
ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా అద్భత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది...
చెన్నై: ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా అద్భుత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్లో ఓ ప్రత్యేకత కూడా చోటుచేసుకుంది. అదేమిటంటే.. 1994 తర్వాత భారత్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో.. తొలిసారి ఇద్దరు స్వదేశీ అంపైర్లు మైదానంలోకి అడుగుపెట్టారు.
1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్లో జరిగిన ఒక టెస్టు మ్యాచ్లో భారత అంపైర్లు ఎల్.నరసింహన్, వీకే రామస్వామి ఆ మ్యాచ్ను పర్యవేక్షించారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నై టెస్టులో ఆ విశేషం చోటుచేసుకుంది. భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు ఐసీసీ కొద్ది రోజుల క్రితమే నితిన్ మీనన్, అనిల్ చౌదరీ, వీరేందర్ శర్మ అనే ముగ్గురు ఐసీసీ ప్యానల్ అంపైర్లను నియమించింది. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టులో అనిల్, నితిన్ బరిలోకి దిగారు. ఇక రెండో టెస్టులో వీరేందర్, నితిన్కు తోడుగా మరో అంపైర్గా వ్యవహరించనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్లకు స్థానిక అంపైర్లను నియమించుకునే అవకాశాన్ని ఐసీసీ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్యానల్ అంపైర్లలో సభ్యులైన అనిల్, వీరేందర్, నితిన్లకు ఈ అవకాశం వచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టులకు జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
ఇవీ చదవండి..
యాష్తో మినీ సమరం..పుజారా భారీ వికెట్
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు