ICC: ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022’.. టీమ్ఇండియా నుంచి ఎవరెవరంటే?
వన్డే ఫార్మాట్లో గతేడాది అత్యద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో కూడిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 (ODI Team of The Year 2022)కి సంబంధించిన పురుషుల, మహిళా జట్లను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఇందులో ఐదుగురికి అవకాశం దక్కగా.. ఇందులో ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పురుషుల, మహిళల ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022’ జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. పురుషుల విభాగంలో.. టీమ్ఇండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే అందులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీ, డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్, గిల్కు స్థానం దక్కలేదు. ఐసీసీ ప్రకటించిన జట్టుకు పాక్ సారథి బాబర్ అజామ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. భారత్ నుంచి మిడిలార్డర్ బ్యాటర్తోపాటు బౌలర్ను మాత్రమే సెలెక్ట్ చేయడం విశేషం. గతేడాది వరుసగా అర్ధశతకాలు సాధించిన శ్రేయస్ అయ్యర్తోపాటు వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్కు మాత్రమే అవకాశం దక్కింది. అయ్యర్ 17 మ్యాచుల్లో 724 పరుగులు సాధించగా.. సిరాజ్ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.
జింబాబ్వేకు సంచలన విజయాలను అందించిన ఆ జట్టు బ్యాటర్ సికిందర్ రజాను ఎంపిక చేసిన ఐసీసీ.. బంగ్లా ఆల్రౌండర్ మెహిదీ హసన్ను కూడా తీసుకొంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ ట్రావిస్ హెడ్, వెస్టిండీస్ నుంచి షై హోప్, న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లేథమ్ను సెలెక్ట్ చేసింది. మొత్తం 11 మంది సభ్యుల్లో ఇద్దరు ఆల్రౌండర్లు కాగా.. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. మరో నలుగురు బౌలర్లు ఉన్నారు. కేవలం ఒకే ఒక్క స్పిన్నర్ ఆడమ్ జంపాను మాత్రమే తుది జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్రీలంక, దక్షిణాఫ్రికా,అఫ్గానిస్థాన్ నుంచి ఒక్కరికీ అవకాశం దక్కలేదు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ఇయర్ 2022: బాబర్ అజామ్, ట్రావిస్ హెడ్, షై హోప్, శ్రేయస్ అయ్యర్, టామ్ లేథమ్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా
మహిళా జట్టులో ముగ్గురు..
ఐసీసీ ప్రకటించిన మహిళల ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ జట్టులోనూ ముగ్గురు భారత ప్లేయర్లు స్థానం సంపాదించారు. ఇద్దరు బ్యాటర్లు కాగా.. మరొకరు బౌలింగ్ జాబితాలో దక్కించుకొన్నారు. టీమ్ఇండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, టాప్ బౌలర్ రేణుకా సింగ్ను ఐసీసీ ఎంపిక చేసింది. స్మృతీ మంధాన గత క్యాలెండర్ సంవత్సరంలో ఒక సెంచరీ, ఆరు అర్ధశతకాలను నమోదు చేయగా.. కెప్టెన్ హర్మన్ రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలను చేసింది. ఇక రేణుకా సింగ్ కేవలం ఏడు మ్యాచుల్లోనే 18 వికెట్లు తీసింది.
ఇదీ జట్టు: అలీసా హీలీ, బెత్ మూనీ, స్మృతీ మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, రేణుకా సింగ్, లారా వోల్వార్డ్ట్,ఆయబొంగ ఖాకా, షబ్నిమ్ ఇస్మాయిల్, నాట్ స్కివెర్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలియా కెర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!