ICC: ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022’.. టీమ్ఇండియా నుంచి ఎవరెవరంటే?
వన్డే ఫార్మాట్లో గతేడాది అత్యద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో కూడిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 (ODI Team of The Year 2022)కి సంబంధించిన పురుషుల, మహిళా జట్లను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఇందులో ఐదుగురికి అవకాశం దక్కగా.. ఇందులో ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పురుషుల, మహిళల ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022’ జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. పురుషుల విభాగంలో.. టీమ్ఇండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే అందులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీ, డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్, గిల్కు స్థానం దక్కలేదు. ఐసీసీ ప్రకటించిన జట్టుకు పాక్ సారథి బాబర్ అజామ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. భారత్ నుంచి మిడిలార్డర్ బ్యాటర్తోపాటు బౌలర్ను మాత్రమే సెలెక్ట్ చేయడం విశేషం. గతేడాది వరుసగా అర్ధశతకాలు సాధించిన శ్రేయస్ అయ్యర్తోపాటు వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్కు మాత్రమే అవకాశం దక్కింది. అయ్యర్ 17 మ్యాచుల్లో 724 పరుగులు సాధించగా.. సిరాజ్ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.
జింబాబ్వేకు సంచలన విజయాలను అందించిన ఆ జట్టు బ్యాటర్ సికిందర్ రజాను ఎంపిక చేసిన ఐసీసీ.. బంగ్లా ఆల్రౌండర్ మెహిదీ హసన్ను కూడా తీసుకొంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ ట్రావిస్ హెడ్, వెస్టిండీస్ నుంచి షై హోప్, న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లేథమ్ను సెలెక్ట్ చేసింది. మొత్తం 11 మంది సభ్యుల్లో ఇద్దరు ఆల్రౌండర్లు కాగా.. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. మరో నలుగురు బౌలర్లు ఉన్నారు. కేవలం ఒకే ఒక్క స్పిన్నర్ ఆడమ్ జంపాను మాత్రమే తుది జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్రీలంక, దక్షిణాఫ్రికా,అఫ్గానిస్థాన్ నుంచి ఒక్కరికీ అవకాశం దక్కలేదు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ఇయర్ 2022: బాబర్ అజామ్, ట్రావిస్ హెడ్, షై హోప్, శ్రేయస్ అయ్యర్, టామ్ లేథమ్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా
మహిళా జట్టులో ముగ్గురు..
ఐసీసీ ప్రకటించిన మహిళల ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ జట్టులోనూ ముగ్గురు భారత ప్లేయర్లు స్థానం సంపాదించారు. ఇద్దరు బ్యాటర్లు కాగా.. మరొకరు బౌలింగ్ జాబితాలో దక్కించుకొన్నారు. టీమ్ఇండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, టాప్ బౌలర్ రేణుకా సింగ్ను ఐసీసీ ఎంపిక చేసింది. స్మృతీ మంధాన గత క్యాలెండర్ సంవత్సరంలో ఒక సెంచరీ, ఆరు అర్ధశతకాలను నమోదు చేయగా.. కెప్టెన్ హర్మన్ రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలను చేసింది. ఇక రేణుకా సింగ్ కేవలం ఏడు మ్యాచుల్లోనే 18 వికెట్లు తీసింది.
ఇదీ జట్టు: అలీసా హీలీ, బెత్ మూనీ, స్మృతీ మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, రేణుకా సింగ్, లారా వోల్వార్డ్ట్,ఆయబొంగ ఖాకా, షబ్నిమ్ ఇస్మాయిల్, నాట్ స్కివెర్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలియా కెర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.