T20 World Cup 2022: ‘కిక్ సండే’.. మాంచి మజానిచ్చే మ్యాచ్ల డే!
ఇప్పటి దాకా ఒక ఎత్తు.. ఆదివారం నుంచి మ్యాచ్లు మరొక ఎత్తు. టీ20 ప్రపంచకప్లో నవంబర్ 6న జరిగే మూడు మ్యాచుల్లో రెండు సెమీస్ బెర్తులు ఎవరివో తేలిపోనుంది. అలాగే సెమీస్, ఫైనల్ మ్యాచ్లు కూడా ఆ వారంలోనే ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రేమికులకు వచ్చే వారం అసలైన పండగ వాతావరణం రాబోతోంది. ఇప్పుడేమీ ఫెస్టివల్స్ లేవు కదా.. అని డౌటా..? అందుకే క్రికెట్ ఫ్యాన్స్కు అని మాత్రమే చెప్పాం. అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి..
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ సూపర్ - 12 పోరు చివరి దశకు వచ్చింది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్కు వెళ్లిపోగా.. మరో రెండు బెర్తుల కోసం నాలుగు జట్లు రేసులో నిలిచాయి. అందుకే నవంబర్ 6 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు పండగే పండగ. మరీ ముఖ్యంగా ఆదివారం అంతా రిలాక్స్ అయిపోదామని అనుకొంటే కుదరదండోయ్.. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్లు జరిగేది ఆదివారాలే మరి. పొట్టికప్ ఫైనల్ (నవంబర్ 13న) మ్యాచ్ సహా రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యే మ్యాచ్లు (నవంబర్ 6న) జరగబోయేది ‘కిక్ సండే’. మరి ఏ జట్లు సెమీస్కు వెళ్లాయి..? రెండు బెర్తుల కోసం పోటీ పడుతున్న టీమ్లు ఏవి..? వారి పరిస్థితి ఏంటో చూద్దాం..
తాజాగా శ్రీలంకపై విజయం సాధించిన ఇంగ్లాండ్ ఉత్తమ రన్రేట్తో గ్రూప్ - 1 నుంచి సెమీస్కు దూసుకెళ్లింది. అంతకుముందే కివీస్ కూడా సెమీస్ బెర్తును ఖరారు చేసుకొన్న తొలి జట్టుగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్ - 2 నుంచి రెండు బెర్తులను దక్కించుకొనే జట్లేవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. మూడు మ్యాచులూ కీలకమైన తరుణంలో కాస్త ముందంజలో నిలిచిన జట్టు భారత్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్, జింబాబ్వేకి అవకాశాలు లేవు. అయితే ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేయగల స్థానంలో ఉండటం గమనార్హం. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటలకు దక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్, ఉదయం 9.30 గంటలకు పాకిస్థాన్ X బంగ్లాదేశ్, మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ X జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయి.
భారత్ X జింబాబ్వే మ్యాచ్..
టీమ్ఇండియా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లతో గ్రూప్ -2లో అగ్రస్థానం దక్కించుకొంది. చివరి మ్యాచ్ మనదే కాబట్టి గెలిచే అవసరం ఉందా..? లేదా..? అనేది అప్పటికే తేలిపోతుంది. అయితే జింబాబ్వేపై విజయం సాధిస్తే అగ్రస్థానంతో సెమీస్కు చేరే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా రద్దు అయినా మనకు ఎలాంటి ఢోకా లేదు. అప్పుడు భారత్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉంటాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ తమ చివరి మ్యాచుల్లో విజయం సాధించినా ఒక సెమీస్ బెర్తు మాత్రం మనదవుతుంది. టీ20 ఫార్మాట్ అంటేనే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే జింబాబ్వే చేతిలో టీమ్ఇండియా ఓడితే మాత్రం.. ఇబ్బందులు తప్పవు.
దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా..
దక్షిణాఫ్రికా ఇప్పుడు 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇందులో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దు ఉన్నాయి. ఇక తన చివరి మ్యాచ్ను నెదర్లాండ్స్తో ఆడాల్సి ఉంది. ప్రస్తుత సఫారీల ఫామ్ను బట్టి నెదర్లాండ్స్ను ఢీకొట్టడం పెద్ద విషయం కాదు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్లో సంచలనాలు నమోదైన నేపథ్యంలో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. అందుకే నెదర్లాండ్స్ ఏదైనా అద్భుతం చేస్తే టీమ్ఇండియాకు ఎలాంటి ఢోకా ఉండదు. తన చివరి మ్యాచ్లో భారత్ ఓడినా ఇబ్బంది లేకుండా సెమీస్కు చేరుకొంటుంది. నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా గెలిస్తే ఏడు పాయింట్లతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
పాకిస్థాన్ - బంగ్లాదేశ్ పోరూ కీలకమే..
ప్రస్తుతం మిగిలి ఉన్న మూడు మ్యాచుల్లో అత్యంత కీలకమైన మ్యాచ్ పాక్ - బంగ్లా మ్యాచ్ కావడం గమనార్హం. దీని వల్ల మూడు జట్ల ఫలితాలు ఆధారపడి ఉంది. ఒక వేళ పాకిస్థాన్ గెలిస్తే.. అప్పుడు ఆరుపాయింట్లు సాధిస్తుంది. జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోతే రన్రేట్ కీలకంగా మారుతుంది. అయితే భారత్ కంటే పాక్ నెట్రన్రేట్ ఎక్కువగా ఉండటంతో దాయాది దేశం సెమీస్ బెర్తును ఖాయం చేసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ పాక్పై బంగ్లా భారీ విజయం కాకుండా మామూలుగా గెలిస్తే మాత్రం టీమ్ఇండియా పంట పండినట్లే. ఎందుకంటే బంగ్లా కంటే భారత్ నెట్రన్రేట్ మెరుగ్గా ఉంది. పాక్పై బంగ్లా భారీ విజయం నమోదు చేసి.. భారత్ తన చివరి మ్యాచ్లో ఓడితే అనూహ్యంగా బంగ్లాదేశ్కు అదృష్టం కలిసి వచ్చి సెమీస్కు చేరుతుంది. వాతావరణం అనుకూలించక మ్యాచ్ రద్దు అయితే దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ చేరుకొని.. బంగ్లా, పాక్ ఇంటిముఖం పట్టక తప్పదు.
ఇన్ని తిప్పలు లేకుండా ఉండాలంటే.. నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా, జింబాబ్వేపై భారత్ విజయాలు నమోదు చేస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ బెర్తులు ఖాయమైపోతాయి. కివీస్, సఫారీలు మొదటి సెమీఫైనల్లో (నవంబర్ 9) తలపడతాయి. అప్పుడు తొలిస్థానంతో టీమ్ఇండియా రెండో సెమీస్లో (నవంబర్ 10) ఇంగ్లాండ్ను ఢీకొట్టే అవకాశం ఉంది. అక్కడ గెలిచిన రెండు జట్లు నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా టైటిల్ కోసం పోరాడుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ