Pogba: రొనాల్డో దారిలో మరో స్టార్ ఫుట్బాలర్
మరో ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో దారిలో నడిచాడు. ప్రెస్మీట్ సందర్భంగా ఫ్రాన్స్ ఫుట్బాల్ స్టార్ పాల్ పోగ్బా తన ముందున్న ఓ బీర్ బాటిల్ను ఏకంగా కింద పెట్టేశాడు....
బీర్ బాటిల్ను కిందపెట్టేసిన పాల్ పోగ్బా
మునిచ్: మరో ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో దారిలో నడిచాడు. ప్రెస్మీట్ సందర్భంగా ఫ్రాన్స్ ఫుట్బాల్ స్టార్ పాల్ పోగ్బా తన ముందున్న ఓ బీర్ బాటిల్ను ఏకంగా కింద పెట్టేశాడు. యూఈఎఫ్ఏ యూరో 2020 టోర్నమెంట్లో భాగంగా జర్మనీపై గెలుపొందిన అనంతరం జరిగిన ప్రెస్మీట్లో ఈ ఘటన జరిగింది. ఈ టోర్నమెంట్లో భాగంగా.. బుధవారం ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ సాగింది. ఈ ఉత్కంఠ పోరులో జర్మనీపై ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా ప్రెస్మీట్లో పాల్గొన్నారు. అయితే టేబుల్పై ఆయన ముందున్న బీర్ బాటిల్ను తీసి కిందపెట్టేశారు. టోర్నీ స్పాన్సర్లలో ఆ కంపెనీ కూడా ఒకటి. మద్యపానానికి దూరంగా ఉండే పోగ్బా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇలా వ్యవహరించిన రెండో క్రీడాకారుడు పోగ్బా. అంతకముందు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన ముందున్న రెండు కోకాకోలా బాటిళ్లను తీసి దూరంగా పెట్టిన విషయం తెలిసిందే.
సోమవారం ఓ జట్టుతో మ్యాచ్కు ముందు పోర్చ్గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో, జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ప్రెస్మీట్ ఏర్పాట్లలో భాగంగా టోర్నీ స్పాన్సర్ అయిన కోకకోలాకు చెందిన రెండు కూల్డ్రింక్ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. ఫిట్నెస్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండే రొనాల్డో ఏమనుకున్నాడో ఏమో కానీ.. ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్బాటిల్ను అందుకొని ‘మంచి నీళ్లు తాగండి’ అని వ్యాఖ్యానించాడు.
రొనాల్డో చాలా సాధారణంగానే ఈ వ్యాఖ్య చేసినా.. కోకకోలా షేర్లపై అది ప్రతికూల ప్రభావం చూపింది. స్టాక్మార్కెట్లో ఆ షేరు విలువ 1.6 శాతం పడిపోయింది. దీంతో కోకకోలా మార్కెట్ విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి 238 బిలియన్ డాలర్లకు కుంగింది. అంటే దాదాపు రూ.29 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయిందన్నమాట. ఈ టోర్నీ స్పాన్సర్లలో కోకకోలా కూడా ఒకటి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.