Umran Malik: వంద మైళ్ల వేగంతో సంధిస్తా.. అక్తర్ రికార్డును బద్దలు కొట్టేస్తా: ఉమ్రాన్
స్పీడ్తో పాటు సరైన లెంగ్త్తో బంతి పడితే ఎంతటి బ్యాటర్కైనా ఆడటం కష్టం. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇలా ఎంతో మంది బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే లెంగ్త్ మిస్ అయినప్పుడు ధారాళంగా పరుగులు సమర్పించేవాడు. అయితే అక్తర్ ఫాస్ట్ రికార్డును అధిగమిస్తానని భారత బౌలర్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: షోయబ్ అక్తర్.. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్ను సంధించిన మాజీ బౌలర్. దాదాపు వంద మైళ్ల వేగంతో బంతిని విసిరి అబ్బురపరిచాడు. 2003 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్తో మ్యాచ్లో 161.3 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి ఈ ఫీట్ను సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ అధికారికంగా బ్రేక్ చేయలేదు. కానీ టీమ్ఇండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అక్తర్ స్పీడ్ను దాటేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపికైన ఉమ్రాన్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ప్రస్తుతం భారత్ తరఫున ఉత్తమంగా రాణించడంపైనే దృష్టిపెట్టానని, అదృష్టం కలిసొస్తే.. తప్పకుండా అక్తర్ రికార్డ్ను బ్రేక్ చేస్తానని మాలిక్ ఓ ఛానెల్తో మాట్లాడుతూ చెప్పాడు. ‘‘అత్యుత్తమంగా బౌలింగ్ చేయడంపైనే నా దృష్టి. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మాత్రం అత్యంత వేగవంతమైన బంతి వేసిన అక్తర్ రికార్డును బద్దలు కొడతా. అయితే ఇప్పుడేమీ దాని గురించి ఆలోచించడం లేదు. భారత్ తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిసారించా. మ్యాచ్ జరిగేటప్పుడు ఎంత వేగంతో బంతిని వేస్తున్నామో ఆలోచించం. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎలా వేశామనే దానిని చూసుకొంటేనే తెలుస్తుంది. అంతేకానీ మ్యాచ్ ఆడేటప్పుడు మా దృష్టంతా బౌలింగ్పైనే ఉంటుంది కానీ.. స్పీడ్ ఎంత వేస్తున్నామనేది పట్టించుకోం’’ అని ఉమ్రాన్ మాలిక్ వెల్లడించాడు.
అంతర్జాతీయ కెరీర్లో ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగవంతమైన బంతిని న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా విసిరాడు. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్కు వేసిన బంతి 153.1 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. అయితే ఐపీఎల్లో అంతకంటే ఎక్కువ స్పీడ్తో బంతిని వేశాడు. దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 157 కి.మీ వేగంతో (97.55 మైళ్లు) బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. షోయబ్ అక్తర్ స్పీడ్ రికార్డును అధిగమించే సత్తా ఉమ్రాన్కు ఉందని అప్పుడే నిరూపించుకొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ