Umran Malik: ధోనీ, కోహ్లీ చెప్పిన మాటలకు ఉమ్రాన్ ఉప్పొంగిపోయాడు
ఒకానొక సందర్భంలో టీమ్ఇండియా మాజీ సారథులు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ చెప్పిన మాటలకు ఉమ్రాన్ మాలిక్ ఉప్పొంగిపోయాడని అతడి తండ్రి అబ్దుల్ రషీద్ హర్షం వ్యక్తం చేశారు...
(Photos: Kohli and Umran Malik Instagram)
ఇంటర్నెట్డెస్క్: ఒకానొక సందర్భంలో టీమ్ఇండియా మాజీ సారథులు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ చెప్పిన మాటలకు ఉమ్రాన్ మాలిక్ ఉప్పొంగిపోయాడని అతడి తండ్రి అబ్దుల్ రషీద్ హర్షం వ్యక్తం చేశారు. టీమ్ఇండియాలో ఉమ్రాన్ భవిష్యత్తు తారగా ఎదుగుతాడని వారు చెప్పినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్లో హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ 150 కిమీ వేగంతో బంతుల్ని బుల్లెట్లలా సంధిస్తున్నాడు. దీంతో ప్రత్యర్థులు పరుగులు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోన తన కుమారుడి గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా రషీద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు నా కుమారుడితో ఏం చెప్పారో.. ఆ విషయాలను అతడు నాతో పంచుకున్నాడు. నా కుమారుడు టీమ్ఇండియా భవిష్యత్తు తారగా ఎదుగుతాడని వారు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం నాతో చెప్పేటప్పుడు అతడెంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇద్దరు దిగ్గజాల నుంచి అంత గొప్ప మాటలు వచ్చేసరికి చాలా సంబరపడ్డాడు’ అని ఉమ్రాన్ తండ్రి పేర్కొన్నాడు. అలాగే తన కుమారుడిని టీమ్ఇండియాలో చూడాలని, ఏదో ఒకరోజు ప్రపంచకప్లోనూ అతడు ఆడాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా ఆడతాడనే నమ్మకం కూడా ఉందన్నారు. దీంతో దేశం గర్వపడే స్థితికి ఎదుగుతాడని ఆకాక్షించాడు. ఇవి తన కలలని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!