MIw vs UPw: ఉత్కంఠభరిత మ్యాచ్లో యూపీ విజయం.. ముంబయికి తొలి ఓటమి
డబ్ల్యూపీఎల్ (WPL 2023)లో భాగంగా ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
ముంబయి: ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో యూపీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ టోర్నీలో తొలిసారి ఓటమిపాలైంది. 128 పరుగుల లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. యూపీ అతి కష్టం మీద చేరుకుంది. మెక్గ్రాత్ (38; 25 బంతుల్లో 6×4,1×6), గ్రేస్ హారిస్ (39; 28 బంతుల్లో 7×4) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కేర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రంట్, హెయిలీ మ్యాథ్యూస్, వాంగ్ తలో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదన ప్రారంభించిన యూపీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దేవికా వైద్య (1) తీవ్ర నిరాశపరిచింది. మాథ్యూస్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే హర్మన్ ప్రీత్ కౌర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరింది. మరో ఓపెనర్ హీలీ (8) కూడా తక్కువ పరుగులకే వెనుదిరింది. వాంగ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మెక్గ్రాత్తో కలిసి నవ్గిరే ఇన్నింగ్స్ (12) నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ జట్టు స్కోరు 27 పరుగుల వద్ద బ్రంట్ బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి భాటియాకు దొరికిపోయింది.
ఆ తర్వాత హారిస్తో కలసి మెక్గ్రాత్ ఇన్నింగ్స్ నిర్మించింది. ఆచితూచి ఆడుతూ... వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇద్దరూ కలసి స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. అయితే, ఈ జోడీని అమేలియా కెర్ విడగొట్టింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద మెక్గ్రాత్ కాట్ ఆండ్ బౌల్డ్గా వెనుదిరిగింది. కెర్ వేసిన 15.4వ బంతికి వాంగ్ కు క్యాచ్ ఇచ్చి హారిస్ వెనుదిరిగింది. దీంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (13*), సోఫీ (16*) అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ (35; 30 బంతుల్లో 1X4,3X6) పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (25), వాంగ్ (32) మినహా మిగతావారెవ్వరూ పెద్దగా రాణించలేదు. యూపీ బౌలర్లలో ఎక్లెస్టోన్ 3 వికెట్లు పడగొట్టగా, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు, అంజలి శ్రావణ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.