Team India:‘టీమ్ఇండియాలో భారీ మార్పులు చేయాల్సిన అవసరముంది’
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ వరసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలుకావడంతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ టీమ్ఇండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వడంతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ టీమ్ఇండియాకు పలు కీలక సూచనలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే విధానంలో టీమ్ఇండియాలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 2015 వన్డే ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన తర్వాత తమ క్రికెట్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఇంగ్లాండ్ను చూసి భారత్ నేర్చుకోవాలన్నాడు.
‘ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేక రంగాల్లో ఆవిష్కరణలు చేస్తోంది. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే విషయానికొస్తే మన విధానం దశాబ్దం నాటిది. 2015 ప్రపంచకప్లో మొదటి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమణ తర్వాత ఇంగ్లాడ్ కఠినమైన మార్పులు చేసింది. ఇంగ్లాండ్లాగా పటిష్టమైన జట్టుగా మారడానికి టీమ్ఇండియా కఠినమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరముంది. భారత టీ20 లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి మనం (టీమ్ఇండియా) టీ20 ప్రపంచకప్ గెలవలేదు. గత 5 ఏళ్లలో వన్డేల్లో టీమ్ఇండియా ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ల్లో విజయాలు సాధించడంతోపాటు కొన్నిసార్లు పేలవ ప్రదర్శనలు చేసింది. అయినా, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఈ విధానం మారాలి’ అని వెంకటేష్ ప్రసాద్ సూచించాడు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్, టీమ్ఇండియా మధ్య డిసెంబరు 10న మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో గెలుపొంది గత ఓటముల నుంచి ఉపశమనం పొందాలని భారత్ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.