Jhulan Goswami: ఝులన్ గోస్వామి వీడ్కోలు చెప్పనుందా..? అదే చివరి మ్యాచ్ కానుందా..?
భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా సాగిన క్రికెట్
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా సాగిన క్రికెట్ ప్రస్థానానికి వచ్చే నెలలో ఆమె ముగింపు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబరులో ఇంగ్లాండ్తో ఆడే మూడో వన్డే మ్యాచే ఆమె చివరిదిగా సమాచారం. దీంతో ఆ మ్యాచ్తో ఝులన్కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
39 ఏళ్ల ఝులన్ గోస్వామి ఈ ఏడాది మార్చిలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నారు. ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆమె చివరి సారిగా కన్పించారు. ఆ తర్వాత జులైలో శ్రీలంకతో జరిగిన సిరీస్కు ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా.. వచ్చే నెలలో జరగబోయే ఇంగ్లాండ్ సీరిస్కు బీసీసీఐ ఝులన్ను ఎంపిక చేసింది.
సెప్టెంబరు 18 నుంచి భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు ఝులన్ను ఎంపిక చేయడం గమనార్హం. అయితే ఝులన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలని భావిస్తున్న నేపథ్యంలో వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతోనే ఆమెను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసినట్లు సమాచారం. మహిళా క్రికెట్కు రెండు దశాబ్దాల పాటు ఆమె అందించిన సేవలను గౌరవించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 24న లార్డ్స్ మైదానంలో జరిగే మూడో వన్డే ఆమెకు చివరి మ్యాచ్ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్కు చెందిన ఝులన్ 19ఏళ్ల వయసులోనే జట్టులోకి వచ్చింది. రెండు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో బౌలర్గా, కెప్టెన్గా తనకెదురులేదనిపించింది. వన్డేల్లో 250 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఏ దేశానికి చెందిన మహిళా క్రికెటర్లూ ఈ దరిదాపున కూడా లేకపోవడం విశేషం. ఇక మొత్తం 12 టెస్టులు, 201 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడిన ఝులన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి తన కెరీర్లో అత్యధికంగా 352 వికెట్లు పడగొట్టింది. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా బౌలర్ ఈమే కావడం మరో ప్రత్యేకం.
క్రికెట్లోకి రావాలనుకునే ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన ఝులన్ జీవితంపై త్వరలోనే సినిమా కూడా రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ వెండితెరపై ఝులన్గా ఆమె నిజజీవితాన్ని ఆవిష్కరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్