Vijay Shankar: విజయ్ శంకర్ను ఎలా తీసుకున్నారు..? గుజరాత్ ఆల్రౌండర్పై విపరీతమైన ట్రోలింగ్
గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు...
(Photo: Vijay Shankar Instagram)
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గతరాత్రి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతడు వన్డౌన్ బ్యాట్స్మన్గా వచ్చి ఏడు బంతులాడి కేవలం రెండే పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని ఎందుకు తీసుకుంటున్నారని అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు గుజరాత్ టీమ్ ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ అనే ప్రతిభావంతుడైన యువకుడిని పక్కనపెట్టి విజయ్ను ఎంపిక చేయడంతో మరింత రెచ్చిపోతున్నారు.
విజయ్ కొన్నేళ్లుగా ఈ టీ20 లీగ్ ఆడుతూ వరుసగా విఫలమవుతున్నాడు. మధ్యలో టీమ్ఇండియాకు ఎంపికైనా ఒక్క మ్యాచ్లోనూ ఆకట్టుకోలేదు. ఇక ఈ లీగ్లోనూ ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతడి వల్ల 2019 వన్డే ప్రపంచకప్లో అంబటిరాయుడు చోటు కోల్పోయాడని, ఇప్పుడు సాయిసుదర్శన్ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. సాయి ఇటీవల పంజాబ్తో ఆడిన మ్యాచ్లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని కాదని, విజయ్ను ఎలా తీసుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన విజయ్ శంకర్ 6.33 సగటుతో కేవలం 19 పరుగులే చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.