Virat Kohli: డుప్లెసిస్.. ఇకపై ఫీల్డింగ్ చేసేటప్పుడు నన్ను రింగ్లోనే ఉంచు: కోహ్లీ
బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సారథి ఫా డుప్లెసిస్ను విచిత్రమైన కోరిక కోరాడు. ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్ల్లో తనని ఫీల్డింగ్లో 30 గజాల సర్కి్ల్లోనే ఉంచాలన్నాడు...
దిల్లీపై గెలుపు.. బెంగళూరు విజయ సంబురాలు
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సారథి ఫా డుప్లెసిస్ను విచిత్రమైన కోరిక కోరాడు. ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్ల్లో తనని ఫీల్డింగ్లో 30 గజాల సర్కి్ల్లోనే ఉంచాలన్నాడు. శనివారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 16 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బెంగళూరు జట్టు డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు చేసుకుంటున్న సమయంలో కోహ్లీ ఇలా కోరాడు.
ఈ మ్యాచ్లో 190 పరుగుల ఛేదనలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (34; 17 బంతుల్లో 3x4, 2x6) ధాటిగా ఆడుతూ బెంగళూరు నుంచి మ్యాచ్ లాగేసుకునేలా కనిపించాడు. అయితే, సిరాజ్ వేసిన 16.3 ఓవర్కు అతడు ఔటయ్యాడు. అప్పుడు సర్కిల్లోనే కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ తల మీదుగా బౌండరీ కొడదామని భావించి పంత్ షాట్ ఆడాడు. అది గాల్లో దూసుకుపోతుండగా కోహ్లీ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో పంత్ ఔటయ్యాక దిల్లీ లక్ష్యం దిశగా సాగలేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఆ సెంటిమెంట్ను ఫాలో అవుదామని భావించి డుప్లెసిస్ను తనని అక్కడే ఫీల్డింగ్ పెట్టాలని సరదాగా కోరాడు.
అదే వీడియోలో కోహ్లీ.. తన మిత్రుడు, మాజీ సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో డివిలియర్స్ ఒక్కడే చేసే పనిని ఇప్పుడు తాము ఇద్దరు, ముగ్గురు చేస్తున్నామన్నాడు. అలాగే ఈ మ్యాచ్లో తాను పట్టిన క్యాచ్తో పాటు దినేశ్ కార్తీక్ (66 నాటౌట్; 34 బంతుల్లో 5x3, 5x6) ఇన్నింగ్స్ కూడా డివిలియర్స్కు అంకితమిస్తున్నామని తెలిపాడు. అనంతరం కార్తీక్ మాట్లాడుతూ వాంఖడేలో అభిమానులు తనని డీకే డీకే అని సంబోధిస్తూ అరవడం సంతోషంగా ఉందన్నాడు. కాగా, మీరూ ఆ బెంగళూరు ఆటగాళ్లు ఎలా సంబరాలు చేసుకున్నారో ఈ కింద వీడియోలో చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?