Virat Kohli: టెస్టుల్లో 50 కంటే తక్కువకు దిగజారిన సగటు..
టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకొని మరీ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన విరాట్ కోహ్లీ.. మరోసారి బ్యాటింగ్లో తడబాటుకు గురి కావడం కనిపిస్తోంది. బంగ్లాతో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో పడుతున్నాడా..? బంగ్లాతో టెస్టులకు ముందు వరకు అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్లో మాత్రం విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్... ఇక రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరి నిరాశపరిచాడు. బంగ్లా బౌలర్ మెహదీ హసన్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీని ఆడే క్రమంలో మోమినల్ అద్భుత క్యాచ్కు ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్లో విరాట్ బ్యాటింగ్ సగటు 50కి కిందికి పడిపోయింది.
ప్రస్తుతం 104 టెస్టుల్లో 27 శతకాలు, 28 అర్ధశతకాలతో 8,119 పరుగులను విరాట్ కోహ్లీ సాధించాడు. తన 52వ టెస్టులో యావరేజ్ 50కిపైకి చేరింది. ఇప్పుడు సరిగ్గా 104వ టెస్టు మ్యాచ్ సందర్భంగా మరోసారి 50 కంటే కిందికి పడిపోయింది. ప్రస్తుతం 48.91 సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో 57.47, అంతర్జాతీయ టీ20ల్లో 52.74 సగటుతో ఉన్నాడు.
మరోసారి చెత్త రికార్డు..
ఇప్పటికే పరుగుల సగటును తగ్గించుకొన్న విరాట్ కోహ్లీ.. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. గత పది టెస్టు ఇన్నింగ్స్ల్లో ఒక్క అర్ధశతకం నమోదు చేయలేకపోయాడు. 2014లోనూ ఇలాగే ఇంగ్లాండ్తో పది ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 39 కావడం గమనార్హం. బంగ్లాతో రెండో టెస్టులో భారత్ 100 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. 145 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా.. మూడో రోజు ఆట ముగిసేసమయానికి కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయి కేవలం 45 పరుగులను మాత్రమే చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?