IND vs HK : సూర్యకుమార్కు విరాట్ ‘టేక్ ఏ బౌ’.. వైరల్గా మారిన వీడియో!
సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్కి ‘టేక్ ఏ బౌ’ చెప్పాడు. ఇదంతా ఆసియా కప్లో భాగంగా..
ఇంటర్నెట్ డెస్క్: సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్కి ‘టేక్ ఏ బౌ’ చెప్పాడు. ఈ ఘటన ఆసియా కప్లో భాగంగా హాంకాంగ్తో ఆడిన మ్యాచ్లో చోటుచేసుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 192/2 భారీ స్కోరు సాధించింది. అనంతరం హాంకాంగ్ 152/5కే పరిమితమైంది. దీంతో 40 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, టీమ్ఇండియా భారీ స్కోరు సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ (68*) కీలక పాత్ర పోషించాడు.
ఓపెనింగ్ బ్యాటింగ్కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ (21) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా.. కేఎల్ రాహుల్ (36) మాత్రం ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ పెవిలియన్కు చేరే సమయానికి టీమ్ఇండియా స్కోరు 94/2 (13 ఓవర్లకు). హాంకాంగ్ బౌలర్లు కాస్త పొదుపుగానే బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా నెమ్మదిగానే తన ఇన్నింగ్స్ను మొదలుపెట్టాడు. క్రీజ్లో కుదురుకునేందుకు సమయం తీసుకొన్నాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ మాత్రం మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలిసి కేవలం ఏడు ఓవర్లలోనే మూడో వికెట్కు 98 పరుగులను జోడించారు.
మరీ ముఖ్యంగా భారత ఇన్నింగ్స్లోని చివరి ఓవర్లో సూర్యకుమార్ వీరవిహారం చేశాడు. మొత్తం నాలుగు సిక్సర్లతో సహా 26 పరుగులను రాబట్టాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల రికార్డును అందుకొంటాడని అభిమానులు భావించారు. అయితే, హాంకాంగ్ బౌలర్ హరూర్ అర్షద్ తెలివిగా స్లో బౌన్సర్ను విసిరాడు. సూర్యకుమార్ ఆ బంతిని కొట్టేందుకు ప్రయత్నించినా బ్యాట్కు తాకలేదు. మరుసటి బాల్ను కూడా స్లో బౌన్సర్గా సంధించాడు. ఈ సారి మాత్రం సూర్యకుమార్ లెగ్సైడ్ సిక్సర్ బాదాడు. ఇక చివరి బంతికి షాట్కు ప్రయత్నించినా రెండు పరుగులే లభించాయి. ఈ క్రమంలో కేవలం 22 బంతుల్లోనే సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకొన్నాడు. దీంతో ఇన్నింగ్స్ ముగిశాక సూర్యకుమార్ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్ ఏ బౌ’ చెప్పాడు. కోహ్లీ నుంచి ఇలాంటి అభినందన వస్తుందని ఊహించలేదని, ఎంతో ఆనందగా ఉందని సూర్యకుమార్ తెలిపాడు. ఈ వీడియోను స్పోర్ట్స్ ఛానెల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. నెట్టింట్లో వైరల్గా మారిన ఆ వీడియోను మీరూ వీక్షించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు