FIFA World Cup 2022: చెస్ ఆడిన ఫుట్బాల్ దిగ్గజాలు.. కోహ్లీ కామెంట్
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభమైంది. దిగ్గజ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలపైనే అభిమానుల దృష్టంతా ఉంది.
(ఫొటో : రొనాల్డో ఇన్స్టా)
ఇంటర్నెట్ డెస్క్ : క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ.. ఫుట్బాల్ దిగ్గజ ఆటగాళ్లు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు పెద్ద పండగే. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్ కప్ 2022 వచ్చేసింది. మెస్సీ, రొనాల్డోలపైనే అందరి దృష్టి. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్పే చివరిదని భావిస్తున్న నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్యే ఫైనల్ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్లు కలిసి ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఫిఫా ప్రపంచ కఫ్ నేపథ్యంలో ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్రికెట్లో రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటో చూసి.. ‘ఎంత అద్భుత చిత్రమో’ అంటూ కామెంట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి కాస్త విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఫుట్బాల్ ప్రపంచకప్ ఖతార్ వేదికగా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. బాణసంచా వెలుగులు, కళాకారుల విన్యాసాల మధ్య ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.