FIFA World Cup 2022: చెస్‌ ఆడిన ఫుట్‌బాల్‌ దిగ్గజాలు.. కోహ్లీ కామెంట్‌

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ప్రారంభమైంది. దిగ్గజ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీలపైనే అభిమానుల దృష్టంతా ఉంది.

Updated : 21 Nov 2022 13:39 IST

                               (ఫొటో : రొనాల్డో ఇన్‌స్టా)

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాళ్లు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు పెద్ద పండగే. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 వచ్చేసింది. మెస్సీ, రొనాల్డోలపైనే అందరి దృష్టి. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్పే చివరిదని భావిస్తున్న నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్యే ఫైనల్‌ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్‌ ప్లేయర్లు కలిసి ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఫిఫా ప్రపంచ కఫ్‌ నేపథ్యంలో  ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్‌ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో చూసి.. ‘ఎంత అద్భుత చిత్రమో’ అంటూ కామెంట్‌ చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ తర్వాత కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి కాస్త విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఖతార్‌ వేదికగా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. బాణసంచా వెలుగులు, కళాకారుల విన్యాసాల మధ్య ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని