T20 World Cup: అలాంటి వారే ట్రోల్స్ చేసేది: విరాట్ కోహ్లీ
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మీద భారత్ ఓడిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ...
షమీపై ట్రోల్స్ను ఖండించిన టీమ్ఇండియా కెప్టెన్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మీద భారత్ ఓడిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఓటమికి కారణమంటూ మహమ్మద్ షమీపై నెటిజన్లు అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే టీమ్ఇండియా సహా మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు షమీకి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ట్రోల్స్పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. వినోదం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వ్యక్తులకు ధైర్యం ఉండదని, మనిషి సామర్థ్యం అత్యల్ప స్థాయికి పడిపోయినప్పుడే ఇలాంటి ట్రోల్స్ చేస్తుంటారని విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. టీమ్ఇండియా ఓటమికి మహమ్మద్ షమీని బాధ్యుడిని చేస్తూ ట్రోల్స్ చేయడాన్ని ఖండించాడు. క్రికెటర్లు, క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టడం నెటిజన్లకు ఎంటర్టైన్మెంట్గా మారిందని.. ఇది విచారకరమైన పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో కీలక పోరులో టీమ్ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ షమీపై సోషల్ మీడియా ట్రోల్స్ను తీవ్రంగా ఖండించాడు. ‘‘మేం మైదానంలో ఆడటానికి మంచి కారణం ఉంది. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ధైర్యంలేని వ్యక్తులు మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు. వారికి ఎవరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడే ధైర్యం ఉండదు. వారు తమ గుర్తింపును దాచుకుని మరీ సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ కోసం క్రీడాకారులు, క్రికెటర్లపై ట్రోల్స్ చేయడం సరదా అయిపోయింది. ఈ డ్రామా అంతా ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చింది. ఆత్మవిశ్వాసం లోపించడం, దయాగుణం లేకపోవడంపై ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇతరులను ట్రోల్స్ చేయడం వినోదంగా భావిస్తారు. ఇలాంటప్పుడే మేమంతా ఒక బృందం మాదిరిగా ఎలా కలిసి ఉండాలో అర్థం చేసుకున్నాం. ఒకరికొకరం అండగా నిలుస్తాం. మైదానంలో ఎలా మా బలాలను వినియోగించాలో దానిపైనే దృష్టి పెడతాం’’ అని విరాట్ కోహ్లీ వివరించాడు. ఇక కివీస్తో మ్యాచ్ విషయానికొస్తే.. టీమ్ఇండియా బ్యాటర్లు న్యూజిలాండ్ పేస్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది మాదిరిగా తమను ఇబ్బందిపెట్టాలని చూస్తే మాత్రం ట్రెంట్బౌల్ట్కు సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్