CWG 2022: ‘‘మీరెంతో గొప్ప పురస్కారాలు తెచ్చారు’’
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంతో ముగించింది. అందులో..
కామన్వెల్త్ అథ్లెట్లకు కోహ్లీ శుభాకాంక్షలు
ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ సహా స్క్వాష్, లాంగ్జంప్, టీటీ విభాగాల్లో క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి బంగారు పతకాలను సాధించారు. లాన్బౌల్స్, ట్రిపుల్ జంప్, క్రికెట్ క్రీడల్లో తొలిసారి పతకాల పంట పండింది. అత్యధికంగా రెజ్లింగ్లో 12 పతకాలను భారత రెజ్లర్లు పట్టేశారు. వెయిట్ లిఫ్టింగ్లో 10, అథ్లెటిక్స్లో 8, బ్యాడ్మింటన్లో ఆరు పతకాలను అందుకున్నారు. జూడోలో మూడు, స్వ్కాష్లో రెండు, హాకీలో రెండు పతకాలు రావడం విశేషం. ఈ క్రమంలో భారత అథ్లెట్లను అభినందిస్తూ టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా అభినందనలు కురిపించాడు. ‘‘మన దేశం కోసం ఎంతో విలువైన పురస్కారాలను అందించారు. విజేతలతోపాటు కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న అథ్లెట్లకు కంగ్రాట్స్. మేమెప్పుడూ గర్వపడుతూనే ఉంటాం. జైహింద్’’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
షూటింగ్, ఆర్చరీ వంటి క్రీడలు లేకపోయినా ఈసారి భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనే ఇచ్చారు. 2018 కామన్వెల్త్ ఫలితాలకు దగ్గరగా రావడం విశేషం. అప్పుడు కూడా 64 పతకాలతో (25 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అస్ట్రేలియా (178) పతకాల సంఖ్య కూడా తగ్గడం విశేషం. అయితే ఇంగ్లాండ్, కెనడా మాత్రం తమ స్వర్ణాల సంఖ్యను పెంచుకుని దూసుకొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!