IND vs WI : అరుదైన ఘనత సాధించిన టీమిండియా.. రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ
టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్తో శుక్రవారం (ఫిబ్రవరి 18న) జరిగిన రెండో టీ20 మ్యాచులో విజయం సాధించడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 100 విజయాలు సాధించిన రెండో
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్తో శుక్రవారం (ఫిబ్రవరి 18న) జరిగిన రెండో టీ20 మ్యాచులో విజయం సాధించడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 100 విజయాలు సాధించిన రెండో దేశంగా భారత్ రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు 155 టీ20 మ్యాచులు ఆడిన టీమిండియా వంద మ్యాచుల్లో విజయం సాధించింది. 51 మ్యాచుల్లో పరాజయం పాలైంది. మరో నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. మరో వైపు, అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ జట్టు 189 మ్యాచుల్లో 118 విజయాలు సాధించింది. అయితే, టీ20ల్లో గెలుపు శాతం పరంగా చూస్తే.. పాక్ కంటే మన జట్టే ముందుంది. భారత్ విజయాల శాతం 65.23 కాగా.. పాక్ 64.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. 50 కంటే ఎక్కువ టీ20 మ్యాచులు ఆడిన జట్లతో పోల్చితే కేవలం అఫ్గానిస్థాన్ (67.97 శాతం) మాత్రమే మనకంటే ముందుంది.
* రోహిత్ సరసన కోహ్లీ..
ఈ మ్యాచులోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (52) కీలక ఇన్నింగ్స్తో ప్రస్తుత కెప్టెన్ రోహిత సరసన చేరాడు. ఇప్పటి వరకు 121 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ.. 30 సార్లు 50కి పైగా స్కోర్లను నమోదు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, 4 శతకాలు ఉన్నాయి. మరో వైపు, కోహ్లీ 97 మ్యాచుల్లోనే.. 30 సార్లు 50కి పైగా స్కోర్లను నమోదు చేశాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోహ్లీ టీ20ల్లో 3,296 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (112 మ్యాచుల్లో 3299 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరో నాలుగు పరుగులు చేస్తే గప్తిల్ రికార్డు బద్దలవుతుంది. కాగా, రోహిత్ శర్మ 121 మ్యాచుల్లో 3256 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా