IND vs SA: కోహ్లీ.. జట్టు కూర్పు, బ్యాటింగ్ మీద దృష్టిపెట్టాలి..!
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ జట్టు కూర్పు, ఆటగాళ్ల బ్యాటింగ్ మీద దృష్టిసారించాలని, అనవసర విషయాల మీద కాదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు...
స్టంప్ మైక్ వద్ద అరవడంతో నెటిజన్ల చురకలు
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ.. జట్టు కూర్పు, ఆటగాళ్ల బ్యాటింగ్ మీద దృష్టిసారించాలని, అనవసర విషయాల మీద కాదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో గురువారం ఆ జట్టు సారథి డీన్ ఎల్గర్ (30) అశ్విన్ బౌలింగ్లో తొలుత ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి తర్వాత బాల్ ట్రాకింగ్లో నాటౌట్గా తేలడంపై టీమ్ఇండియా సారథి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ వేసిన 21వ ఓవర్లో తొలుత అతడు ఎల్బీగా ఔటయ్యాడని అంపైర్ ప్రకటించడంతో ఎల్గర్ రివ్యూకు వెళ్లాడు. అక్కడ బంతి ట్రాకింగ్ను గమనించి ఎల్గర్ సైతం పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. అయితే, చివరికి బంతి వికెట్ల మీద నుంచి వెళ్లినట్లు కనిపించడంతో తిరిగొచ్చి బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ స్టంప్ మైక్ వద్దకెళ్లి తన నోటికి పనిచెప్పాడు.
దక్షిణాఫ్రికా అధికార ప్రసారదారైన సూపర్ స్పోర్ట్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించాడు. ‘‘బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు’’ అని ఎంతో ఆగ్రహంగా అరుస్తూ కనిపించాడు. తర్వాత కేఎల్ రాహుల్, అశ్విన్ సైతం.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా పలు సందర్భాల్లోనూ కోహ్లీ ఏదో ఒకటి అంటుండటం కనిపించింది. దీంతో ఆ వీడియోలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అతడి తీరు సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. కాగా, ఇంకొందరు ఒకడుగు ముందుకేసి తొలుత జట్టు కూర్పు పైన, ఆటగాళ్ల బ్యాటింగ్పై దృష్టిసారించమని హితవు పలుకుతున్నారు. మరోవైపు పలువురు విదేశీయులు టీమ్ఇండియా సారథిని ఆటలో నిషేధించాలని కూడా పోస్టులు పెడుతున్నారు.
ఇక టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం కోహ్లీ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ పరిణతి సాధించలేదని అన్నాడు. స్టంప్ మైక్ వద్ద ఇలా స్పందించడం దారుణమని విమర్శించాడు. ఇలా చేస్తే యువకులకు స్ఫూర్తిమంత్రంగా ఉండలేడని తెలిపాడు. అలాగే తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ స్లిప్లో ఔటైనప్పుడు 50-50 అవకాశాలున్నప్పుడు మిన్నకుండిపోయాడని గుర్తుచేశాడు. ఈ విషయంపై ద్రవిడ్ అతడితో మాట్లాడతాడని గంభీర్ ఓ క్రీడా ఛానెల్లో వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!