Virat Kohli: జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లి అలా చేశాడు : పార్థివ్ పటేల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. జట్టు ప్రయోజనాల కోసమే తనకు చెల్లించే మొత్తాన్ని తగ్గించుకున్నాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్..
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. జట్టు ప్రయోజనాల కోసమే తనకు చెల్లించే మొత్తాన్ని తగ్గించుకున్నాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. గత సీజన్లో రూ.17 కోట్లు తీసుకున్న విరాట్ కోహ్లి.. ఐపీఎల్-2022 సీజన్కి రూ. 15 కోట్లే తీసుకోనున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు రూ. 11 కోట్లు, పేసర్ మహమ్మద్ సిరాజ్కు రూ. 7 కోట్లు వెచ్చించి ఆర్సీబీ రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్, లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్లను ఆర్సీబీ అట్టిపెట్టుకోకపోవడం గమనార్హం.
‘జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లి తన ఫీజులో కోత విధించుకున్నాడు. ఒక వేళ అతడు రూ.17 కోట్లు తీసుకుంటే.. ఫ్రాంఛైజీ పర్స్లో రెండు కోట్లు తగ్గుతాయి. అదే రూ.15 కోట్లు తీసుకుంటే.. జట్టుకి రూ. 2 కోట్లు మిగిల్చినట్లవుతుంది. దాంతో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడనిపిస్తోంది. విరాట్ కోహ్లి ఎంత నాణ్యమైన ఆటగాడో మనందరికీ తెలుసు. అతడు తీసుకున్న నిర్ణయం సరైనదే’ అని పార్థివ్ పటేల్ అన్నాడు.
జట్టు కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది : విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడటం తప్ప.. తనకు మరో ఆలోచన లేదని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. క్రికెట్ నుంచి తప్పుకునేంత వరకు బెంగళూరు జట్టుకే ఆడతానని అన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్లో ఓడిపోవడంతో ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ‘బెంగళూరు జట్టుకు ఆడటం తప్ప నాకు మరో ఆలోచన లేదు. జట్టు కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది. వచ్చే సీజన్లో గొప్పగా రాణించగలననే నమ్మకం ఉంది. ఆర్సీబీ ఆటగాడిగా మరింత నిబద్ధతతో ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని కోహ్లి అన్నాడు. ఐపీఎల్-2021 సీజన్ తర్వాత కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!