Virat Kohli: మీరు దేవుడిచ్చిన గిఫ్ట్.. నాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్: రొనాల్డోపై కోహ్లీ భావోద్వేగ పోస్టు
ఫుట్బాల్ దిగ్గజం రొనాల్డో(Cristiano Ronaldo) ఆటతీరును మెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సందేశాలు పెడుతున్నారు. ఈ స్టార్ ఆటగాడికి పెద్ద అభిమాని అయిన క్రికెట్ దిగ్గజం కింగ్ కోహ్లీ(Virat Kohli) కూడా.. మనసును హత్తుకునే పోస్టు చేశాడు
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్ దిగ్గజం, ఆల్టైమ్ గ్రేట్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) గురించే ఇప్పుడు చర్చంతా. ఫిఫా ప్రపంచకప్ టోర్నీ(fifa world cup 2022) నుంచి పోర్చుగల్ నిష్క్రమించడంతో.. అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి ఈ సాకర్ సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో 1-0 తేడాతో ఓడి పోర్చుగల్(Portugal) ఇంటికి పయనమైన విషయం తెలిసిందే. దీంతో కెరీర్లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలన్న రొనాల్డో(Cristiano Ronaldo) కల చెదిరింది. 37 ఏళ్ల రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు దాదాపు లేనట్లే. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరును మెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ స్టార్ ఆటగాడికి పెద్ద అభిమాని అయిన టీమిండియా క్రికెట్ దిగ్గజం కింగ్ కోహ్లీ(Virat Kohli) కూడా.. రొనాల్డోను ప్రశంసిస్తూ మనసుకు హత్తుకునే సందేశాన్ని పోస్టు చేశాడు.
‘ఈ ఆటలో మీరు సాధించిన ఘనతను, అభిమానులకు అందించిన స్ఫూర్తిని ఏ ట్రోఫీగానీ లేదా టైటిల్గానీ దూరం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని.. మీ ఆటను చూసినప్పుడు మాకు కలిగే అనుభూతిని ఏ టైటిలూ వర్ణించలేదు. అది దేవుడిచ్చిన బహుమతి. ఆటలో ప్రతి క్షణం మనసుపెట్టి ఆడటం.. కఠోర శ్రమ, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం.. ప్రతి క్రీడాకారుడికి నిజమైన ఆదర్శం.. ఇవన్నీ ఆ దేవుడు మీకందించిన ఆశీర్వాదాలు. అందుకే, మీరు నాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని రొనాల్డో గొప్పతనాన్ని కోహ్లీ కొనియాడాడు.
ఈ ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన తర్వాత ‘నా కల ఇక ముగిసింది’ అని బాధతప్త హృదయంతో రొనాల్డో అన్నాడు. ఈ మ్యాచ్లో ఓటమి ఖాయం కాగానే.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలో చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. అతడు కన్నీళ్లను తుడుచుకొంటూ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న చిత్రాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరున్న రొనాల్డో కెరీర్లో.. వరల్డ్కప్ ఓ లోటుగానే మిగిలి ఉంటుంది. పోర్చుగల్ (Portugal) తరఫున 195 మ్యాచ్లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్ చేశాడు. ఇక పోర్చుగల్కి తిరిగి ఆడేది లేనిది అతడు ఇంకా ధ్రువీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్