అంపైర్లకు ఆ అవకాశం ఎందుకు లేదో తెలియదు..!
గతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్(57; 31 బంతుల్లో 6x4, 3x6) ఔటైన వివాదాస్పద తీర్పుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు...
సూర్య వివాదాస్పద ఔట్పై కోహ్లీ మండిపాటు
ఇంటర్నెట్డెస్క్: గతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్(57; 31 బంతుల్లో 6x4, 3x6) ఔటైన తీరు వివాదాస్పదమైంది. దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సామ్కరన్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి సూర్య ఆడిన షాట్ను డేవిడ్ మలన్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, అదే సమయంలో బంతి నేలకు తాకినట్లు కనిపించినా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. విషయం థర్డ్ అంపైర్కు చేరడంతో రీప్లే చూసి దాన్ని అనుమానాస్పద ఔట్గా భావించి అంపైర్స్కాల్ ఆధారంగా ఔట్గా ప్రకటించాడు.
ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ సూర్యకుమార్పై ప్రశంసలు కురిపించాడు. తొలిసారి బ్యాటింగ్ చేస్తూనే అద్భుతమైన ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు. ఇషాన్లాగే మెరుపు బ్యాటింగ్ చేశాడన్నాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవంతో ఈ యువకులు ఇక్కడ భయం లేకుండా ఆడుతున్నారన్నాడు. అనంతరం సూర్య ఔట్పై స్పందించిన కోహ్లీ ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అస్పష్టంగా ఉన్నప్పటికీ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔటివ్వడంపై కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి నిర్ణయాలు వివాదాస్పదమౌతాయని కోహ్లీ అన్నాడు.
‘టెస్టు సిరీస్ సమయంలో నేను అజింక్య రహానె పక్కన ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి చోటుచేసుకుంది. రహానే క్యాచ్ స్పష్టంగా పట్టుకున్నా దానిపై అతడు కచ్చితంగా లేడు. దాంతో మేం థర్డ్ అంపైర్ నిర్ణయానికి వెళ్లాం. ఇలాంటి విషయాల్లో ఫీల్డరే సందేహాస్పదంగా ఉంటే, స్క్వేర్ లెగ్లో ఉన్న అంపైర్ స్పష్టంగా చూసే ప్రసక్తే లేదు. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటప్పుడు అంపైర్లకు కూడా ‘ఐ డోంట్ నో కాల్’ అనేది ఎందుకు ఉండకూడదో నాకు అర్థంకావడం లేదు. అది అంపైర్ కాల్లాగే ఉంటుంది. ఈ నిర్ణయాలు మ్యాచ్ల ఫలితాలను మార్చగలవు. ఈరోజు మేం దాన్ని ఎదుర్కొన్నాం. రేపు వేరే జట్టు ఇలాంటి స్థితిలో ఉండొచ్చు. ఇలాంటి వాటిని ఆటలో నుంచి తొలగించి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కీలకమైన మ్యాచ్ల్లో ఇలాంటివి సరికావు. మైదానంలో కచ్చితమైన స్పష్టత ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని కోహ్లీ అన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 9 ఓవర్లకే 70/3 స్కోర్తో నిలిచింది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే క్రమంలో సూర్య కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అర్ధశతకం పూర్తి చేసుకొని మరింత వేగంగా పరుగులు చేసే సమయంలో ఔటయ్యాడు. ఆపై శ్రేయస్ అయ్యర్(37; 18 బంతుల్లో 5x4, 1x6), పంత్(30; 23 బంతుల్లో 4x4), పాండ్య(11), శార్దూల్ ఠాకుర్(10) మెరవడంతో జట్టు స్కోర్ 185/8గా నమోదైంది. తర్వాత ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 177/8 స్కోర్ సాధించి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జేసన్రాయ్(40; 27 బంతుల్లో 6x4, 1x6), బెన్స్టోక్స్(46; 23 బంతుల్లో 4x4, 3x6) మెరుపుబ్యాటింగ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?