Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా డుప్లెసిస్.. కోహ్లీ స్పందన చూడండి!
రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూతన సారధిగా ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు...
బెంగళూరు: రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూతన సారథిగా ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. శనివారం ఆ జట్టు యాజమాన్యం డుప్లెసిస్ పేరును ఖరారు చేయగానే విరాట్ స్పందించాడు. అతడు మాట్లాడిన వీడియోను ఆర్సీబీ ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.
‘త్వరలోనే ఐపీఎల్-15వ సీజన్ ప్రారంభమవుతున్న సంగతి మీకు తెలిసిందే. ఇక నేను చెప్పదల్చుకున్న ముఖ్యమైన విషయం.. డుప్లెసిస్ ఆర్సీబీ సారథిగా ఎంపికయ్యాడు. ఎంతో కాలంగా అతడు నాకు మంచి స్నేహితుడు. అతడికి ఆర్సీబీ బాధ్యతలను అప్పగించడం ఆనందంగా ఉంది. డుప్లెసిస్ కేవలం క్రికెట్లోనే కాకుండా నాకు వ్యక్తిగతంగానూ బాగా తెలిసిన వ్యక్తి. డుప్లెసిస్.. మాక్స్వెల్తో కలిసి ఆడటం ఆర్సీబీ అభిమానులకు పండగలా ఉంటుంది. మరోవైపు ఈసారి మేం తీసుకున్న కొత్త, పాత ఆటగాళ్లతో జట్టు నూతన ఉత్తేజంతో ఉంది. చూస్తుంటే చాలా బలంగా, సమతూకమైన జట్టులా కనిపిస్తోంది. దీంతో ఈ సీజన్ కోసం నేనెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
కాగా, 2013లో ఆర్సీబీ కెప్టెన్గా ఎంపికైన విరాట్ గతేడాది వరకూ జట్టును ముందుండి నడిపించాడు. గత సీజన్ పూర్తవ్వగానే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అయితే.. ఎన్నో అంచనాలతో ప్రతి సంవత్సరం బరిలోకి దిగే ఈ జట్టు.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. ఈ నేపథ్యంలో కొత్త సారథి.. ఆర్సీబీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి