2011 final: నా కెరీర్లో ఆ 35 పరుగులు అత్యంత విలువైనవి: విరాట్ కోహ్లీ
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తాను సాధించిన 35 పరుగులు క్రికెట్ కెరీర్లో అత్యంత విలువైన పరుగులని టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తాను సాధించిన 35 పరుగులు క్రికెట్ కెరీర్లో అత్యంత విలువైన పరుగులని టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. టీమ్ఇండియా నాడు రెండోసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడి శనివారం నాటికి 11 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో కోహ్లీ తాజాగా నాటి విశేషాలను బెంగళూరు ఫ్రాంఛైజీతో పంచుకున్నాడు. అప్పుడు సచిన్ (18) ఔటయ్యాక తాను క్రీజులోకి వెళుతుంటే ఒక మాట చెప్పాడని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.
‘ఆరోజు టీమ్ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచినప్పుడు బరిలోకి దిగి బ్యాటింగ్ చేయాల్సిన ఒత్తిడి నాకింకా గుర్తుంది. సెహ్వాగ్, సచిన్ ఔటయ్యారు. అప్పుడు నేను క్రీజులోకి వెళుతుంటే సచిన్ నాతో మాట్లాడాడు. గంభీర్తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని చెప్పాడు. నేనూ అలాగే చేశాను. మేం ఇద్దరం మూడో వికెట్కు 83 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించాం. ఆరోజు నేను సాధించిన 35 పరుగులు.. నా కెరీర్లో అత్యంత విలువైనవి. ఎందుకంటే అత్యంత కీలకమైన మ్యాచ్లో కష్టాల్లో ఉన్నప్పుడు గంభీర్తో కలిసి జట్టును గాడిలో పెట్టాను. అందుకెంతో సంతోషించా. ఆ రోజు ప్రపంచకప్ గెలిచిన క్షణాలు ఎంతో అద్భుతం. ఎప్పటికీ మర్చిపోలేను’ అని కోహ్లీ నాటి విశేషాల్ని పంచుకున్నాడు.
అనంతరం సచిన్ గురించి మాట్లాడిన విరాట్.. ‘తెందూల్కర్ 21 ఏళ్ల పాటు భారత క్రికెట్ను తన భుజాలపై మోశాడు. మేం విజయం సాధించాక అతడిని మా భుజాలపై మోయాలనుకున్నాం. అందుకు అదే సరైన సమయమని భావించాం. సచిన్ గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. టీమ్ఇండియా తరఫున సచిన్ సాధించిన రికార్డులు చాలా గొప్పవి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.