Virat Kohli: ఆ విషయమే నాకు బాధ కలిగించింది: విరాట్ కోహ్లీ
ప్రస్తుత 20 టోర్నీలో ఫామ్ కోల్పోయి తీవ్ర నిరశపర్చిన బెంగళూరు బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ గతరాత్రి ఒక్క ఇన్నింగ్స్తో అందరినీ సంతోషంలో ముంచెత్తాడు...
ఫామ్ అందుకున్నాక ఏం చెప్పాడంటే?
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుత టీ20 లీగ్లో ఫామ్ కోల్పోయిన బెంగళూరు బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ గతరాత్రి ఒక్క ఇన్నింగ్స్తో అందరినీ సంతోషంలో ముంచెత్తాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అతడు ఫామ్ అందుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తన ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో తాను జట్టు కోసం రాణించలేకపోయానని, దాంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. గణాంకాలు కాకుండా ఆ విషయమే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు.
‘ఈ మ్యాచ్లో నేను మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా టీమ్ మంచిస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో నాపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే. అలాంటప్పుడు మన ఆలోచనా విధానాన్ని సరైన దృక్పథంలో ఉంచుకోవాలి. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. నేనీ మ్యాచ్లో రాణించేందుకు చాలా కష్టపడ్డా. మ్యాచ్కు ముందు నెట్స్లో 90 నిమిషాల పాటు సాధన చేశా. దీంతో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగా. షమి బౌలింగ్లో తొలిషాట్ నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగింది. ఫీల్డర్లపై నుంచి ఆడగలననే ఆత్మవిశ్వాసం లభించింది. అలాగే ఈ సీజన్లో అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. వాళ్లందరి ప్రేమా ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని విరాట్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా, గుజరాత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు రెండు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. విరాట్ (73), డుప్లెసిస్ (44), మాక్స్వెల్ (40*) దంచికొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం