Virat Kohli : కోహ్లీ జింబాబ్వేపై అలవోకగా సెంచరీ కొట్టేస్తాడు.. కానీ ప్రయోజనం శూన్యం!
విరాట్ కోహ్లీ ఫామ్తో ఇబ్బంది పడుతుంటడం.. విండీస్తో వన్డే సహా టీ20 సిరీస్లకు దూరంగా పెట్టడం.. ఆగస్టులో ఆసియా కప్, అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జట్టులో...
కివీస్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్ వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ ఫామ్తో ఇబ్బంది పడుతుంటడం.. విండీస్తో వన్డే సహా టీ20 సిరీస్లకు దూరంగా పెట్టడం.. ఆగస్టులో ఆసియా కప్, అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అసలు జట్టులో కోహ్లీ ఉంటాడా.. ఉండడా అన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. టీ20 ప్రపంచకప్ వరకు విశ్రాంతి తీసుకోవాలని కొందరు సూచిస్తుండగా.. మరికొందరైతే ప్రతి మ్యాచ్ను ఆడాలని కోరుకొంటున్నారు. ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం విండీస్ పర్యటనను భారత్ ఆగస్ట్ 7వ తేదీ వరకు కొనసాగించనుంది. విండీస్ పర్యటన ముగిశాక పది రోజులపాటు విశ్రాంతి. ఆ తర్వాత మూడు వన్డేలను ఆడేందుకు టీమ్ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో జింబాబ్వేతో కోహ్లీని ఆడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కివీస్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ మాత్రం దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని కొట్టిపడేశాడు.
‘‘విరాట్ కోహ్లీకి కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండగా ఉండటం మంచిదే. అదేవిధంగా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. అయితే జింబాబ్వేతో వన్డేలు ఆడేందుకు విరాట్ కోహ్లీని పంపించాలని కొందరు చెబుతున్నారు. జింబాబ్వేపై కోహ్లీ అలవోకగా సెంచరీ కొట్టగలడు. కానీ అతడికి పెద్దగా ప్రయోజనం ఉండదు. జింబాబ్వేను తక్కువ చేయడం కాదు.. కోహ్లీ మళ్లీ ఫామ్లోకి రావాలంటే జింబాబ్వేతో ఆడాల్సిన అవసరం లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నేను చెబుతా’’ అని స్టైరిస్ సూచించాడు.
వారిద్దరికి తెలుసు..
టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యేలోపు పూర్తి సన్నద్ధంగా ఉండేలా జట్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సబా కరీం తెలిపాడు. అదేక్రమంలో విరాట్ కోహ్లీ విలువేంటో రోహిత్, రాహుల్ ద్రవిడ్కు తెలుసునని చెప్పాడు. ‘‘ప్రపంచకప్ జట్టులోకి విరాట్ను తీసుకునే ఆలోచన యాజమాన్యంతోపాటు సెలెక్టర్లకు ఉందో లేదో స్పష్టతనివ్వాలి. జట్టు విజయానికి కోహ్లీ అవసరమని భావించిన తర్వాత.. విరాట్ ఫామ్లోకి రావడానికి నా దగ్గర ఓ మార్గం ఉంది. ‘జింబాబ్వేతో మ్యాచ్లు ఆడాలని నేను ఆదేశించను. అక్కడ ఆడితేనే ప్రపంచకప్కు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పను. ఆడాలని భావిస్తే వెళ్లు ఆడు. లేకపోతే విరామం తీసుకుంటానని చెబితే అలానే చేయ్. ఆసియా కప్ వరకు విశ్రాంతి తీసుకో’ అని కోహ్లీకి చెబుతా’’ అని మాజీ సెలెక్టర్ సబా కరీం వ్యాఖ్యానించాడు. ఒకవేళ జింబాబ్వేతో ఆడినప్పుడూ విఫలమైతే కోహ్లీని జట్టు నుంచి తప్పించడం పెద్ద తప్పిదమవుతుందని కరీం అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి