IND vs AUS: నిరీక్షణకు తెర.. 14 నెలల తర్వాత అర్ధ శతకం బాదిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అర్ధ శతకం బాదాడు. టెస్టుల్లో అతడికిది 29వ హాఫ్ సెంచరీ.
అహ్మదాబాద్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Vriat Kohli) కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ఆసీస్తో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. కానీ, అహ్మదాబాద్లో ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో విరాట్ అర్ధ శతకం (59) పూర్తి చేసుకుని నాటౌట్గా నిలిచాడు. కోహ్లీకిది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల తర్వాత టెస్టుల్లో విరాట్ హాఫ్ సెంచరీ బాదాడు. అతడికిది 15 ఇన్నింగ్స్ల తర్వాత మొదటి అర్ధ సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్కు ముందు చివరగా 2022 జనవరిలో కేప్టౌన్లో దక్షిణాఫ్రికాపై 79 పరుగులు చేశాడు. అనంతరం 15 ఇన్నింగ్స్ల్లో 29, 45, 23, 13, 11, 20, 1, 19 నాటౌట్.. 24, 1, 12, 44, 20, 22, 13 హాఫ్ సెంచరీ చేయలేదు. ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ మరో ఘనత కూడా అందుకున్నాడు. సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత స్వదేశంలో 4000 పరుగులు చేసిన ఐదవ భారత క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు.
ఇక, ఆసీస్తో నాలుగో టెస్టు విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ (59 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (16 బ్యాటింగ్) నాటౌట్గా ఉన్నారు. టీమ్ఇండియా ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్మన్ గిల్ (128) సెంచరీతో ఆకట్టుకోగా.. పుజారా (42), రోహిత్ శర్మ (35) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్