‘ఈ ఇద్దరం.. త్వరలోనే ముగ్గురం’

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు శుక్రవారం మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విరాట్‌ తన ప్రియసఖిని గుర్తు చేసుకుంటూ వివాహంబంధం...

Updated : 29 Nov 2022 13:43 IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు శుక్రవారం మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విరాట్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా, అనుష్క నిండు గర్భిణి కావడంతో తమ ఇంట్లోనే ఉంటోంది. దీంతో మూడో వార్షికోత్సవాన్ని వారిద్దరూ వేర్వేరుగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత టీమ్‌ఇండియా సారథి తమ పెళ్లి ఫొటోను ట్విటర్‌లో పంచుకొని అనుష్కకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. అనంతరం ఆమె కూడా అతడికి వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పింది.

‘నీతో కలిసి మూడేళ్లు.. జీవిత ప్రయాణమంతా నీతోనే’ అని విరాట్‌ పేర్కొనగా అనుష్క సైతం అలాగే ఇంకాస్త భిన్నంగా ట్వీట్‌ చేసింది. ‘మనిద్దరి బంధానికి మూడేళ్లు.. ఈ ఇద్దరం అతి త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం’ అని భావోద్వేగపూరితంగా పేర్కొంది. కాగా, వీరిద్దరూ పెళ్లికిముందు ఓ యాడ్‌ షూటింగ్‌లో కలిసిన సంగతి తెలిసిందే. మనసులు కలవడంతో కొన్నేళ్లు ప్రేమాయణం సాగించారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వరుష్క జోడీ ఒక్కటైంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ 13వ సీజన్‌కు ముందు ఈ స్టార్‌ జంట జనవరిలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు అభిమానులకు శుభవార్త చెప్పింది. ఇక విరాట్‌ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు. 

ఇవీ చదవండి..

ఐపీఎల్‌ ఆర్జనలో ధోనీనే నం.1

మొతెరాలో మ్యాచ్‌ల మోత


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని