Virat Kohli: విరాట్ కోహ్లీ @ 14 ఇయర్స్.. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలయ్యా!
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 14 ఏళ్లు అవుతోంది. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 14 ఏళ్లు అవుతోంది. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో కెరీర్ని ఆరంభించాడు. అనంతరం టీమ్ఇండియాలో కీలక ఆటగాడి మారి తన పదునైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకుని జట్టుని విజయపథంలో నడిపించాడు. 14 ఏళ్ల కెరీర్ పూర్తయిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ‘14 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టా. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం’ అనే క్యాప్షన్ జోడించి ఓ వీడియోని పోస్ట్ చేశాడు.
ఈ సందర్భంగా తన కెరీర్లో ఎదురైన పలు అనుభవాలను విరాట్ పంచుకున్నాడు. కెరీర్లోని ఒత్తిడి కొన్నిసార్లు తన మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని కోహ్లీ అన్నాడు. ‘‘నన్ను ఆదరించే, ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్నా కూడా నేను ఒంటరివాడిగా ఫీలైన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురైందని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇది చాలా కఠినమైన సమస్య. మనం అన్ని సమయాల్లో బలంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు అది మిమ్మల్ని బాధిస్తుంది. అథ్లెట్లు విశ్రాంతి తీసుకోవడం, ఆటల ఒత్తిడి నుంచి కోలుకోని కోర్ సెల్ఫ్తో తిరిగి కనెక్ట్ కావడం చాలా ముఖ్యం’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. ఆగస్టు 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్తో విరాట్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.