Sachin - Virat Kohli: విరాట్ సంక్రాంతి సెంచరీ.. మరో 2 సచిన్ రికార్డులు బద్దలు
భారత క్రికెట్లో సచిన్ (Sachin) రికార్డులను కొట్టేయగల ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్లో (IND vs SL) రెండు శతకాలు సాధించిన కోహ్లీ.. సచిన్ రికార్డులను అధిగమించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ సెంచరీ (166*) సాధించాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరుపై ఉన్న రెండు రికార్డులు బద్దలుకొట్టాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలను బాదిన బ్యాటర్గా ఇన్నాళ్లూ సచిన్ ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి విరాట్ వచ్చాడు. తిరువనంతపురంలో విరాట్ బాదిన ఈ సెంచరీ సొంత గడ్డపై 21వది కావడం గమనార్హం. 20 సెంచరీలతో సచిన్ ఇన్నాళ్లూ ఈ లిస్ట్లో టాప్1లో ఉన్నాడు.
ఒకే జట్టుపై అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ రోజు శ్రీలంకపై కొట్టిన సెంచరీ పదవది కావడం గమనార్హం. ఈ సిరీస్ తొలి వన్డేలో విరాట్ శతకం సాధించి సచిన్తోపాటు ఈ జాబితాలో సమంగా (9) నిలిచాడు. ఈ రోజు శతకంతో ఒకడుగు ముందుకేశాడు. ఇక వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్గా ఉన్న సచిన్ (49)కు విరాట్కి (46) మధ్య దూరం ఇంకాస్త తగ్గింది. ఇంకో మూడు వందలు బాదేస్తే సమం... నాలుగోది కూడా కొట్టేస్తే ఏకంగా దాటేస్తాడు. అలా సచిన్ మాటను కోహ్లీ నిజం చేసేస్తాడు.
ఎందుకంటే... కొన్నాళ్ల క్రితం ‘మీ రికార్డులను బద్దలు కొట్టే క్రికెటర్లు ఎవరు అని మీరు అనుకుంటున్నారు’ అని ఓ యాంకర్ సచిన్ను అడిగితే.. సచిన్ చెప్పిన పేర్లలో విరాట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అన్నట్లు ఇదే మ్యాచ్లో విరాట్ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలోకి వచ్చాడు విరాట్. ప్రస్తుతం 12,754 పరుగులు సాధించి శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దెనె (12,650)ను వెనక్కి నెట్టేశాడు. సచిన్ (18,426) అందరికంటే అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మరో వెయ్యి పరుగులు చేస్తే విరాట్ మూడో స్థానానికి వచ్చేస్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.