Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
టీ20 క్రికెట్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శక్తిని చాలా వరకు హరిస్తుందని, అందువల్ల పొట్టి ఫార్మాట్ను వదిలేసి వన్డేలు, టెస్టులకు మాత్రమే పరిమితం కావాలని అక్తర్ సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (100) బాదిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేరిట ఉంది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (75) శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఒక్క కోహ్లీకే ఉంది. ఈ నేపథ్యంలో విరాట్కు పాక్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ చాలా భిన్నమైన సూచన చేశాడు. టీ20 క్రికెట్ అతని శక్తిని చాలా వరకు హరిస్తుందని, అందువల్ల పొట్టి ఫార్మాట్ను వదిలేసి వన్డేలు, టెస్టులకు మాత్రమే పరిమితం కావాలని అక్తర్ సూచించాడు.
‘‘ఒక క్రికెటర్గా మీరు నన్ను అడిగితే.. విరాట్ కోహ్లీ టీ20లు ఆడటం మానేసి టెస్టు, వన్డే ఫార్మాట్లకు మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నా. టీ20 క్రికెట్ అతని శక్తిని చాలా వరకు హరిస్తుంది. కోహ్లీ ఎంతో ఉత్సాహంగా ఉండే వ్యక్తి. టీ20ల్లో ఆడాలనుకుంటున్నాడు. అతనికి ఈ ఫార్మాట్ అంటే ఇష్టం. కానీ, ఈ సమయంలో విరాట్ తన శరీరాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం అతని వయస్సు 34. ఇంకో 6-8 ఏళ్లు సులభంగా ఆడగలడు. మరో 30-50 టెస్టు మ్యాచ్లు ఆడితే ఆ మ్యాచ్ల్లో 25 సెంచరీలు చేయడం అతనికి కష్టం కాదని కచ్చితంగా అనుకుంటున్నా. కోహ్లీ ఫిట్నెస్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయాలి. ప్రస్తుతం ఆసియాలో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ గొప్ప ఆటగాళ్లు’’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే