Cricket News: కేన్ను నెట్టేసిన స్మిత్.. విరాట్@4
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టాడు. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు...
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టాడు. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు ఎగబాకాడు. పరుగులు చేయడంలో విఫలమైన ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీసు ముగిసిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ (886 రేటింగ్) కేవలం 13 పరుగులే చేశాడు. గాయంతో రెండో టెస్టు ఆడలేదు. ఫలితంగా అతడి రేటింగ్ పాయింట్లలో కోత పడింది. 891 రేటింగ్తో స్టీవ్స్మిత్ తిరిగి నంబర్ వన్గా ఆవిర్భవించాడు. గ్యారీ సోబర్స్ (189 టెస్టులు), వివ్ రిచర్డ్స్ (179 టెస్టులు) తర్వాత ఎక్కువ మ్యాచులు 167 ఆడిన క్రికెటర్గా నిలిచాడు. పరుగులు చేయకుండా నిరాశ పరిచిన ఇంగ్లాండ్ సారథి జో రూట్ 797 రేటింగ్తో ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 814 రేటింగ్తో కొనసాగుతున్నాడు. రిషభ్ పంత్ (797), రోహిత్ శర్మ (797) సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో ప్రతి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 307 రేటింగ్తో 64వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ అజాజ్ పటేల్ కెరీర్ బెస్ట్ 323 రేటింగ్ సాధించాడు. డబుల్ సెంచరీ చేసిన డేవాన్ కాన్వే బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా 61వ స్థానంలో నిలిచాడు. ప్యాట్ కమిన్స్ (908), రవిచంద్రన్ అశ్విన్ (850), టిమ్ సౌథీ (830) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. కాగా టాప్-10లో యాష్ మినహా భారత్ నుంచి మరెవ్వరూ లేకపోవడం గమనార్హం. ఆల్రౌండర్ల జాబితాలో యాష్ 2, జడ్డూ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు