Virat Kohli: విరాట్ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ
క్రీడల్లో ప్రతి ఆటగాడు ప్రత్యేక జెర్సీ నంబరుతో కన్పిస్తాడు. మన పరుగుల వీరుడు కోహ్లీ నంబరు 18. దీని వెనుక ఓ కన్నీటి గాథ ఉంది తెలుుసా..?
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) పేరు వినగానే.. క్రికెట్ అభిమానులకు ‘జెర్సీ నంబరు 18 (jersey Number 18)’ కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్ అయినా.. అంతర్జాతీయ టోర్నీ అయినా కోహ్లీ ఆ జెర్సీ నంబరులోనే కన్పిస్తాడు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కింగ్ తన సంఖ్యను మార్చుకోలేదు. అయితే దీని వెనుక ఓ ఉద్వేగభరిత కథ ఉంది. తన తండ్రి గుర్తుగా కోహ్లీ.. ‘నంబరు 18 (jersey Number 18)’ జెర్సీ మాత్రమే వేసుకుంటున్నాడు.
కోహ్లీ (Virat Kohli ) 17 ఏళ్ల వయసులో అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006 డిసెంబరు 18వ తేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో దిల్లీ తరఫున కర్ణాటకతో కోహ్లీ ఓ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఓ పక్క తండ్రి మరణించినా.. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో దుఃఖాన్ని దిగమింగుకుని కోహ్లీ.. ఆ రోజు మ్యాచ్ ఆడి ఏకంగా 90 పరుగులు చేశాడు. ఆ రోజు మ్యాచ్ ముగిశాక తండ్రి అంత్యక్రియలకు పాల్గొన్నాడు. తండ్రి మరణం తర్వాత మ్యాచ్ ఆడటంపై కోహ్లీ స్పందిస్తూ.. ఆ క్షణం తాను వ్యక్తిగా మారానని, కఠిన నిర్ణయం తీసుకున్నానని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. అందుకే తన తండ్రి మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నంబరు 18 (jersey Number 18)ని ఎంచుకున్నాడు.
ఇక అండర్ 19 జట్టులో చేరినప్పుడు తొలుత కోహ్లీ (Virat Kohli )కి జెర్సీ నంబరు 44ను కేటాయించారట. అయితే కొన్నాళ్లకు అతడు జెర్సీ నంబరు 18కి మారాడు. అదే నంబరుతో అండర్ 19 జట్టుకు సారథిగా భారత్కు ప్రపంచకప్ అందించాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ టీమిండియా జట్టులో చేరేనాటికి అదృష్టవశాత్తూ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా విరాట్కు ఆ నంబరు దక్కింది. ఇక నాటి నుంచి కోహ్లీ అదే నంబరుతో తన కెరీర్ను కొనసాగిస్తున్నాడు.
ఈ నంబరుకు మరో ప్రత్యేకత కూడా ఉందట. కోహ్లీ తండ్రి ప్రేమ్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నంబరు 18నే వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా ఇప్పటికీ అదే నంబరుతో కన్పిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.