Virat Kohli: మరోసారి కోహ్లీ స్వర్ణ యుగం ఖాయం: పాక్ మాజీ కెప్టెన్
విరాట్ మరోసారి అభిమానులకు కనువిందు చేయనున్నాడని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరోసారి విరాట్ క్రికెట్ స్వర్ణయుగంలోకి అడుగుపెడతాడని జోస్యం చెప్పాడు.
ఇంటర్నెట్డెస్క్: భారత బ్యాటర్ కింగ్ కోహ్లీ (Virat Kohli) కెరీర్లో మరోసారి స్వర్ణయుగం రానుందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక స్టార్ ఆటగాడు సంగక్కర కెరీర్ లాగే విరాట్ (Virat Kohli) భవిష్యత్తు కూడా ఉండనుందని జోస్యం చెప్పాడు. భట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ‘‘భవిష్యత్తులో విరాట్ (Virat Kohli) అత్యుత్తమ ఆట మరోసారి కనువిందు చేయనుంది. విరాట్ ఇప్పటికే స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఇంకా అతడి స్థాయి ఆటను అందుకోలేదు. అతడి కెరీర్లోని స్వర్ణయుగంలో అన్స్టాపబుల్ మాదిరిగా ఆడాడు. మీరు కుమార సంగక్కర కెరీర్ను చూడండి. అతడు కెరీర్ చివరి రోజుల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. కానీ, కుర్రాడిగా ఉన్నప్పుడు అంత గొప్పగా ఆడలేకపోయాడు. చాలా ఆటగాళ్ల కెరీర్లో ఇది చోటు చేసుకొంది’’ అని విశ్లేషించాడు.
‘‘ఆధునిక క్రికెట్లో మ్యాచ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మోతాదుకు మించిన మ్యాచ్లు ఆటగాడిపై ప్రభావం చూపిస్తాయి. తెలివైన ఆటగాళ్లు వారికి సరిపడా ఫార్మాట్ను ఎంచుకొని దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక్క సారి ఆ పనిచేస్తే.. అతడి ఆట అదే స్థాయిలో కొనసాగుతుంది. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది కోహ్లీనే (Virat Kohli). అతడి కెరీర్లో మరోసారి స్వర్ణయుగం వస్తుందనుకొంటున్నా’’ అని సల్మాన్ భట్ సూచించాడు.
గతేడాది ఆసియాకప్ ముందు వరకు శతకం కోసం కోహ్లీ (Virat Kohli) సుదీర్ఘ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. ఆసియాకప్లో అఫ్గానిస్థాన్పై 122 పరుగులు చేసిన తర్వాత అతడి ఆటతీరు ఒక్కసారిగా మారిపోయింది. మునుపటి లయను అందిపుచ్చుకొని పరుగుల వరదను పారించాడు. మూడు వన్డే శతకాలు నమోదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు