కొండంత లక్ష్యం పిండి చేసి..
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి ఛేదనలో రారాజు, కింగ్ కోహ్లీ అనే పేర్లున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా లక్ష్యం ఎంత పెద్దదైనా చిత్తుచేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య...
ప్రపంచాన్ని మెప్పించి.. కింగ్ కోహ్లీగా మారి..
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి ఛేదనలో రారాజు, కింగ్ కోహ్లీ అనే పేర్లున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా లక్ష్యం ఎంత పెద్దదైనా చిత్తుచేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అలా టీమ్ఇండియా విజయాల్లో ఎన్నో గొప్ప పోరాటాలు చేశాడు. అయితే, కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది 2012 కామన్ వెల్త్ బ్యాంక్ ముక్కోణపు సిరీస్. భారత్-శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆ టోర్నీలో విరాట్ ఓ ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడాడు. లంకతో జరిగిన ఓ కీలక మ్యాచ్లో చెలరేగిపోయి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ గొప్ప ఇన్నింగ్స్ ఆడి నేటికి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..
దిల్షాన్, సంగక్కర దంచికొట్టుడు..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ఇండియాపై భారీ స్కోర్ సాధించింది. దిల్షాన్(160; 165 బంతుల్లో 11x4, 3x6), సంగక్కర(105; 87 బంతుల్లో 8x4, 2x6) శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. ఫైనల్కు చేరాలంటే భారత్ ఆ లక్ష్యాన్ని 40 ఓవర్లలోనే ఛేదించాల్సిన పరిస్థితి. సహజంగా ఏ జట్టుకైనా 50 ఓవర్లలో అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడమంటేనే చాలా కష్టం. అలాంటిది 40 ఓవర్లలోనే టీమ్ఇండియా లక్ష్యాన్ని ఛేదించాలంటే అద్భుతం జరగాలని అంతా భావించారు. కానీ, ఆ అధ్బుతం పేరే విరాట్ కోహ్లీ అని తర్వాత నిరూపితమైంది.
కొండంత స్కోరును పిండి చేసి..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(30), సచిన్ తెందూల్కర్(39) శుభారంభం చేశారు. ఇద్దరూ ఆరు ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. దాంతో పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అనువైన మార్గం కల్పించారు. అయితే, సెహ్వాగ్ ఏడో ఓవర్లో ఔటైన కాసేపటికే.. సచిన్ సైతం పెవిలియన్ చేరాడు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 10 ఓవర్లకు 86/2గా నమోదైంది. తర్వాత జోడీ కట్టిన గంభీర్(63; 64 బంతుల్లో 4x4), విరాట్ కోహ్లీ (133*; 86 బంతుల్లో 16x4, 2x6) మూడో వికెట్కు శతక భాగస్వామ్యం నిర్మించారు. వీరు మొదట నెమ్మదిగా ఆడినా తర్వాత విజృంభించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 201 వద్ద గౌతీ రనౌటయ్యాడు. అప్పటికి భారత్ 13 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రైనాతో విజయ ఢంకా..
గంభీర్ ఔటయ్యాక టీమ్ఇండియాపై ఒత్తిడి పెరిగింది. సాధించాల్సిన రన్రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రైనా (40*; 24 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి బ్యాటింగ్ చేసిన విరాట్.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. మలింగ, కులశేఖర, పర్వేజ్ మహరూఫ్, తిసారా పెరీరా ఎవరినీ వదలకుండ బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో ఓవర్కు 10 పరుగుల చొప్పున స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కోహ్లీ తనలోని క్లాస్ బ్యాటింగ్ను పరిచయం చేశాడు. ఎక్కడా భారీ షాట్లకు పోకుండా చూడచక్కటి డ్రైవ్ షాట్లతో అలరించాడు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. చివరికి 36.4 ఓవర్లలోనే కొండంత లక్ష్యాన్ని పిండి చేసి తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు విరాట్ 8 సెంచరీలు సాధించినా ఈ ఇన్నింగ్స్తోనే అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్