Virat Kohli: విరాట్ వన్డే ‘సెంచరీల’ కింగ్.. ఐపీఎల్కు ముందే అయిపోతాడా..?
టీమ్ఇండియా (Team India) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు (IND vs NZ) సిద్ధమైపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల రారాజు.. కింగ్ కోహ్లీ.. ‘సంక్రాంతి’ పందెం కోడి అనిపించుకొన్న ఆటగాడు టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). దాదాపు రెండున్నరేళ్లపాటు భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయిన కోహ్లీ.. ఆర్నెల్ల నుంచి మాత్రం వీరబాదాడు మొదలెట్టాడు. గత ఆసియా కప్ నుంచి ప్రారంభమైన అతడి బ్యాటింగ్ వీరవిహారం కొనసాగుతూనే ఉంది. గత నాలుగు వన్డేల్లో మూడు శతకాలు బాది భీకర ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin) ‘శత’ శతకాల రికార్డును పక్కనపెడితే, వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ ఎప్పుడు అధిగమిస్తాడు..?
సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు బాదాడు. అదీనూ 463 ఇన్నింగ్స్లు తీసుకొన్నాడు. ఇక విరాట్ అయితే కేవలం 266 ఇన్నింగ్స్ల్లోనే 46 శతకాలు బాదాడు. ఇంకో మూడు సెంచరీలు చేస్తే సచిన్కు సమంగా నిలుస్తాడు. నాలుగు పూర్తి చేసేస్తే వన్డే చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ అవతరిస్తాడు. కోహ్లీ ఫామ్ను చూస్తే ఇది పెద్ద కష్టమేం కాదు. ఈ ఏడాదిలోనే భారీగా వన్డే మ్యాచ్లు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. కివీస్పై విరాట్ కోహ్లీకి మంచి రికార్డే ఉంది. 26 మ్యాచుల్లో 5 శతకాలు, 8 అర్ధశతకాలు సాధించి 1,378 పరుగులు చేశాడు. స్ట్రైక్రేట్ 94.64 కాగా.. సగటు 59.91తో ఉన్నాడు. ఈ సిరీస్లో మరో రెండు శతకాలు చేస్తే రికీ పాంటింగ్ (6), వీరేంద్ర సెహ్వాగ్ (6) రికార్డును విరాట్ అధిగమిస్తాడు.
ఆ తర్వాత ఆసీస్తోనూ..
న్యూజిలాండ్ మీద వరుసగా మూడు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును విరాట్ సమం చేస్తాడు. అప్పుడు ఒక్క సెంచరీ మాత్రమే ‘50’కి బాకీ ఉంటుంది. కివీస్తో సిరీస్ల తర్వాత ఆస్ట్రేలియా భారత్కు రానుంది. ఫిబ్రవరి - మార్చి నెలలో నాలుగు టెస్టులతోపాటు మూడు వన్డేలను భారత్ ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ ఉంటుంది. అంటే ఆలోపే టీమ్ఇండియా ఆరు వన్డేల్లో తలపడనుంది. విరాట్ ఫామ్ను చూస్తే మాత్రం ఆరు వన్డేల్లో నాలుగు సెంచరీలు సాధించడం అసాధ్యమేం కాదు. ఎందుకంటే గత నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు కొట్టిన ఘనత విరాట్ సొంతం. ఆసీస్ పర్యటన ముగిసిన తర్వాత ఐపీఎల్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ కూడా ఉన్నాయి. అయితే ఆసీస్తో సిరీస్లోపే విరాట్ వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును ముగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అప్పుడే మెగా టోర్నీల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు వీలుంటుందనేది వారి భావన.
‘వంద’ వందలు అవ్వాలంటే..
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో వంద శతకాలు (అన్ని ఫార్మాట్లు కలిపి) కొట్టడమంటే సాధారణ విషయం కాదు. అయితే సచిన్ దానిని పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు వేటలోనూ ఉన్న ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే. ప్రస్తుతం టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో కలిపి 74కి చేరాయి. మరో 26 కొడితే వంద పూర్తి కావడం ఖాయం. అలా జరగాలంటే ప్రస్తుతం ఉన్న ఫామ్ను కొనసాగించాలి. అయితే క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చెప్పినట్లుగా.. కనీసం ఐదారేళ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరాట్ భీకర ఫామ్తో ఇంకో 50 మ్యాచ్ల్లోనే ఈ రికార్డును కొట్టేయడం సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ