Virender Sehwag: శుభ్మన్కు స్వేచ్ఛనిచ్చి.. పరుగులు రాబట్టాలి: సెహ్వాగ్
గుజరాత్ ఓపెనర్ శుభ్మన్గిల్ రాణించాలంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య, యాజమాన్యం వెన్నుతట్టి ప్రోత్సహించాలని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్ ఓపెనర్ శుభ్మన్గిల్ రాణించాలంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య, యాజమాన్యం వెన్నుతట్టి ప్రోత్సహించాలని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ యువ బ్యాట్స్మన్ ఇష్టమొచ్చినట్లుగా ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలని.. ఫలితంగా పరుగులు రాబట్టేలా చూడాలని చెప్పాడు. గిల్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ల్లో డకౌటయ్యాక తర్వాతి రెండు మ్యాచ్ల్లో 84, 96 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే, ఆ తర్వాత మరో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్పై స్పందించిన సెహ్వాగ్ గుజరాత్ జట్టుకు పలు విషయాలు సూచించాడు.
‘‘నీకు ఎలా వీలైతే అలా ఆడు. నీ నుంచి మాకు పరుగులు కావాలి. నువ్వు 120 స్ట్రైక్రేట్తో ఆడాతావా లేదా 150 స్ట్రైక్రేట్తో ఆడతావా అనేది నీ ఇష్టం’ అని జట్టు యాజమాన్యం అతడికి చెప్పి చూడాలి. గిల్ ఒకవేళ 7-8 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే తర్వాత వచ్చే డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా వంటి హిట్టర్లకు పని తేలికవుతుంది. ఒకవేళ అలాకాకుండా గతమ్యాచ్లో వలే వీళ్లు ముందే బ్యాటింగ్ చేయడానికి వస్తే ఇబ్బంది పడతారు. దూకుడుగా ఆడాలా లేదా డిఫెండింగ్ చేయాలా అనే డైలామాలో పడతారు. గుజరాత్ టాప్ ఆర్డర్ 10 ఓవర్లకు 80 పరుగులు సాధిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్మన్ మిగతా 10 ఓవర్లలో 120 పరుగులు చేయగలుగుతారు’’ అని సెహ్వాగ్ వివరించాడు.
అలాగే గుజరాత్ గతమ్యాచ్లో మాదిరి టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకొని ప్రయోగాలు చేయొద్దని కూడా వీరూ సూచించాడు. ఈరోజు ముంబయితో ఆడే మ్యాచ్ బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుందని, అక్కడ బౌండరీ లైన్ దగ్గరగా ఉండటంతో లక్ష్య ఛేదన తేలికవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి ఏ గేమ్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి మ్యాచ్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరాడు. కాగా, గుజరాత్ గత మ్యాచ్లో పంజాబ్తో తలపడిన సందర్భంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే, బ్యాట్స్మెన్ విఫలమవడంతో 143/8 స్కోర్తో సరిపెట్టుకొంది. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ ఆ జట్టుకు పలు సూచనలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..