కరోనా బాధితులకు అండగా వీరూ ఫౌండేషన్‌

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Published : 16 May 2021 14:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చాలామందికి సరైన వైద్యం, ఆహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలుస్తున్నాడు.

దిల్లీలోని కరోనా బాధితులు, ఇతర అన్నార్థులకు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తామని ఏప్రిల్ 25న ‘వీరేంద్ర సెహ్వాగ్‌ ఫౌండేషన్‌’ ట్విటర్ వేదికగా  ప్రకటించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ ఫౌండేషన్‌ ఉచిత ఆహార పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 51 వేల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను అందించినట్లు ఈ ఫౌండేషన్‌ తాజాగా ట్వీట్ చేసింది. ఎవరైనా ఆకలితో అలమటించినట్లయితే తమను సంప్రదించాలని కోరింది. ఇతర స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. తమకు సహాయం చేయాలనుకునేవారు virenderfoundation84@upiకి విరాళాలు అందించవచ్చని తెలిపింది.

ఇక, కరోనాపై జరుగుతున్న యుద్ధంలో దేశానికి అండగా ఉండేందుకు క్రీడాకారులు ముందుకువస్తున్నారు. విరుష్క జోడీ రూ.2కోట్ల విరాళం ప్రకటించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రూ.11 కోట్ల విరాళాలను సేకరించింది. ఇప్పటికే  సచిన్‌ తెందూల్కర్‌, శిఖర్ ధావన్‌, యుజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్‌ ఉనద్కత్‌ విరాళాలు ప్రకటించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని