కరోనా బాధితులకు అండగా వీరూ ఫౌండేషన్
దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చాలామందికి సరైన వైద్యం, ఆహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలుస్తున్నాడు.
దిల్లీలోని కరోనా బాధితులు, ఇతర అన్నార్థులకు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తామని ఏప్రిల్ 25న ‘వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్’ ట్విటర్ వేదికగా ప్రకటించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ ఫౌండేషన్ ఉచిత ఆహార పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 51 వేల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను అందించినట్లు ఈ ఫౌండేషన్ తాజాగా ట్వీట్ చేసింది. ఎవరైనా ఆకలితో అలమటించినట్లయితే తమను సంప్రదించాలని కోరింది. ఇతర స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. తమకు సహాయం చేయాలనుకునేవారు virenderfoundation84@upiకి విరాళాలు అందించవచ్చని తెలిపింది.
ఇక, కరోనాపై జరుగుతున్న యుద్ధంలో దేశానికి అండగా ఉండేందుకు క్రీడాకారులు ముందుకువస్తున్నారు. విరుష్క జోడీ రూ.2కోట్ల విరాళం ప్రకటించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రూ.11 కోట్ల విరాళాలను సేకరించింది. ఇప్పటికే సచిన్ తెందూల్కర్, శిఖర్ ధావన్, యుజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్ ఉనద్కత్ విరాళాలు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..