మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
ఇంటర్నెట్డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నెట్టింట్లో చురుకుగా ఉంటాడన్న విషయం తెలిసిందే. మైదానంలో దూకుడుగా పరుగులు సాధించినట్లే సామాజిక మాధ్యమాల్లోనూ అదే వైఖరి కొనసాగిస్తుంటాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సద్విమర్శలతో సరదాగా పోస్ట్లు చేస్తుంటాడు. తాజాగా వీరూ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయంలో యువ క్రికెటర్లు రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. అయితే శుభ్మన్ గిల్ తండ్రి లఖ్విందర్ గిల్, వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం.సుందర్.. వాళ్ల కుమారుల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శతకం సాధించలేకపోయారని నిరాశ పడ్డారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన సుందర్ 62 పరుగులు చేశాడు. శార్దూల్తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక గిల్ రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులు బాదాడు. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆదిలోనే వెనుదిరిగినా పుజారా సహకారంతో లక్ష్యాన్ని కరిగించాడు. ఈ ఇన్నింగ్స్లపై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
అయినా లఖ్విందర్, ఎం.సుందర్ మూడంకెల స్కోరుపైనే ఎక్కువ మక్కువ చూపడంతో.. వారిద్దరిని ఉద్దేశిస్తూ సెహ్వాగ్ సరదాగా ఓ పోస్ట్ చేశాడు. ‘‘తల్లిదండ్రులు..ఎప్పటికీ తల్లిదండ్రులే’’ అని వ్యంగ్యంగా దానికి వ్యాఖ్య జత చేశాడు. దీనికి టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధావన్, యుజువేంద్ర చాహల్ లైక్ కొట్టగా, యువరాజ్ సింగ్ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ చేశాడు.
ఇదీ చదవండి
ఆస్ట్రేలియన్ నోట ‘భారత్ మాతా కీ జై’
ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
-
General News
Headaches: గర్భిణికి తలనొప్పా..? వస్తే ఏం చేయాలో తెలుసుకోండి..!
-
World News
Seoul: సియోల్లో కుంభవృష్టి.. ఎనిమిది మంది మృతి
-
India News
Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
Politics News
Rajagopalreddy: మాజీ ఎంపీలతో కలిసి బండి సంజయ్తో రాజగోపాల్ రెడ్డి భేటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్