WTC Finals: టీమ్ఇండియానే ఫేవరెట్
మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పోటీపడే టీమ్ఇండియా, న్యూజిలాండ్.. రెండు జట్లూ బలంగా ఉన్నాయని, అయితే కోహ్లీసేన ఫేవరెట్గా బరిలోకి దిగనుందని మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు...
తొలి ఇన్నింగ్స్లో పరుగులు చేస్తే.. మ్యాచ్పై పట్టు : వీవీఎస్
ఇంటర్నెట్డెస్క్: మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పోటీపడే టీమ్ఇండియా, న్యూజిలాండ్.. రెండు జట్లూ బలంగా ఉన్నాయని, అయితే కోహ్లీసేన ఫేవరెట్గా బరిలోకి దిగనుందని మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా సవాళ్లను చూసి భయపడదని, ధైర్యంగా ముందుకు సాగుతుందని చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.
‘ప్రస్తుతం రెండు జట్లూ బాగా ఆడుతున్నాయి. అయితే టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగునుంది. ఎందుకంటే ఆ జట్టు గత రెండు మూడేళ్లుగానే కాకుండా కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తోంది. కోహ్లీసేన సవాళ్లను ఎదుర్కొని, వచ్చిన అవరోధాలను దాటుకొని మరీ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీసే అందుకు ఉదాహరణ. కోహ్లీసేనలో ఇప్పుడు ఎంతో మంది నైపుణ్యమున్న ప్రతిభావంతులు ఉన్నారు. మరోవైపు ఈ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక్క మ్యాచే అయినందున ఏ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ పరుగులు చేస్తుందో అదే జట్టు మ్యాచ్పై పట్టుబిగిస్తుంది’ అని లక్ష్మణ్ వివరించాడు.
ఇక టీమ్ఇండియా ప్రస్తుతం సౌథాంప్టన్లో క్వారంటైన్లో ఉండగా, న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ జట్టు ఇంగ్లాండ్ పరిస్థితులను అర్థం చేసుకునే వీలుందని, అది ఛాంపియన్షిప్ ఫైనల్లో వారికి కలిసివస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)