రోహిత్వైపే అందరి చూపు!
తొలి టెస్టులో ఘోరపరాజయం, అనంతరం రెండో టెస్టులో అద్వితీయ విజయం. దీంతో ఆస్ట్రేలియాను భారత్ దెబ్బకి దెబ్బతీసి లెక్క సరిచేసింది. అయితే ఇప్పుడు సిరీస్లో పైచేయి సాధించాలంటే సిడ్నీ టెస్టులో టీమిండియా విజయం సాధించాలి....
కీలక సమరానికి సిద్ధమైన భారత్
ఇంటర్నెట్డెస్క్: తొలి టెస్టులో ఘోరపరాజయం, అనంతరం రెండో టెస్టులో అద్వితీయ విజయం. దీంతో ఆస్ట్రేలియాను భారత్ దెబ్బకి దెబ్బతీసి లెక్క సరిచేసింది. అయితే ఇప్పుడు సిరీస్లో పైచేయి సాధించాలంటే సిడ్నీ టెస్టులో టీమిండియా విజయం సాధించాలి. గాయాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా.. రోహిత్ రాకతో టీమిండియా బలోపేతంగా మారింది. మరోవైపు వార్నర్, పకోస్కీ జట్టులో చేరడంతో టీమిండియాకి ఆస్ట్రేలియా గట్టిపోటీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో రేపు ప్రారంభం కానున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది.
రహానె మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
కీలక ఆటగాళ్లు కోహ్లీ, షమి, ఉమేశ్ యాదవ్ జట్టుకు దూరమైనా రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. విజయంలో రహానె ప్రధాన పాత్ర పోషించాడు. అయితే వార్నర్ రాకతో ప్రత్యర్థి జట్టు కసిగా కనిపిస్తోంది. మరి, మెల్బోర్న్ వేదిక మాదిరిగానే జింక్స్ తన వ్యూహాలతో కంగారూలను కట్టడి చేస్తాడా అనేది చూడాలి. సిడ్నీ టెస్టులో రహానె జట్టును గెలిపిస్తే తన కెరీర్లో అత్యున్నత శిఖరాలు అందుకున్నట్లే. కీలక ఆటగాళ్లు దూరమైన తరుణంలో కంగారూల గడ్డపై సిరీస్ గెలవడమంటే ఆషామాషీ కాదు.
హిట్మ్యాన్ షో కోసం ఎదురుచూపులు
గత కొన్ని రోజులుగా రోహిత్ గురించే వార్తలు! అతడిని తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్షన్ కమిటీపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అతడి ఫిట్నెస్పై ప్రశ్నలు వెల్లువెత్తాయి. మొత్తంగా ఫిట్నెస్ సాధించి క్వారంటైన్ నిబంధనలు పూర్తిచేసుకుని జట్టుతో కలవగా.. అభిమాని అత్యుత్సాహంతో రోహిత్ మరోసారి వార్తల్లోకెక్కాడు. నలుగురు భారత ఆటగాళ్లతో కలిసి ఐసోలేషన్లో ఉన్నాడు. అయితే ఆటగాళ్లందరికీ కరోనా నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, దాదాపు ఏడాది తర్వాత జట్టుతో కలిసిన రోహిత్.. కోహ్లీ గైర్హాజరీలో వైస్ కెప్టెన్గా యువకుల్లో స్ఫూర్తి నింపే బాధ్యతలు అతడిపై ఉన్నాయి. అంతేగాక యువ ఓపెనర్ శుభమన్ గిల్తో ఇన్నింగ్స్ ఆరంభించనున్న హిట్మ్యాన్ ఆసీస్ పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. వైట్ బాల్ క్రికెట్లో స్టార్ బ్యాట్స్మన్ అయిన రోహిత్ నుంచి సిడ్నీ టెస్టులో టీమిండియా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మాజీలు, విశ్లేషకులు సైతం రోహిత్ రీఎంట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో హిట్మ్యాన్ అందరి అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి. నెట్స్ల్లో అతడు అశ్విన్ బంతుల్ని దీటుగా ఎదుర్కొన్నాడు.
పుజారా మెరవాలి!
గత రెండు టెస్టుల్లోనూ పుజారా తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. మయాంక్, పృథ్వీ షా వరుసగా విఫలమవ్వడంతో నయావాల్పై ఒత్తిడి పెరిగింది. అయితే రోహిత్-గిల్ మంచి ఆరంభాన్ని అందిస్తే పుజారాపై ఒత్తిడి తగ్గుతుంది. మునుపటిలా అతడు డిఫెన్స్ ఆయుధంతో ఆసీస్ పేసర్లను కట్టడిచేయగలడు. గత పర్యటనలో కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును విజేతగా నిలిపిన పుజారా సిడ్నీ టెస్టులో మెరవాల్సి ఉంది. అలాగే కోహ్లీ గైర్హాజరీలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రహానె బాక్సింగ్ టెస్టులో శతకం సాధించాడు. అదే ఆత్మవిశ్వాసంతో రహానె మరోసారి చెలరేగితే భారత్ పటిష్ఠ స్థితిలో నిలుస్తుంది.
అయితే ఆసీస్ ముందు భారీస్కోరు ఉంచాలంటే విహారి, పంత్ కూడా రాణించాల్సి ఉంది. కేఎల్ రాహుల్ గాయంతో స్థానాన్ని కాపాడుకున్న విహారి సత్తాచాటాల్సి ఉంది. మరోవైపు పంత్ సిడ్నీ మైదానంలో శతకం బాదిన అనుభవం ఉంది. దూకుడు ఇన్నింగ్స్తో అతడు అలరిస్తే భారత్ పైచేయి సాధిస్తుంది.
సైని అరంగేట్రం
మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ జట్టుకు దూరమవ్వడంతో పేస్ భారమంతా బుమ్రాపైనే పడింది. యువపేసర్లు సిరాజ్, సైనికి మార్గనిర్దేశకం చేస్తూ అతడు వికెట్ల వేటను కొనసాగించాలి. మరోవైపు తొలి మ్యాచ్ ఆడుతున్న సైని, హైదరాబాదీ పేసర్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి సీనియర్ ఆటగాళ్లు లేని లోటును తీర్చాలి. అయితే అశ్విన్ సూపర్ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. అతడు ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్మిత్, లబుషేన్కు కొరకరాని కొయ్యలా మారాడు. అర్థం కాని బంతులు వేస్తూ ఆస్ట్రేలియాకు ప్రశ్నగా మిగిలాడు.
కంగారూలపైనే ఒత్తిడి
వార్నర్ 70 శాతమే ఫిట్నెస్తో ఉన్నా అతడిని జట్టులోకి తీసుకువచ్చిందంటేనే ఆస్ట్రేలియాపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు. అనుభవజ్ఞుడు వార్నర్ ఉంటే జట్టు బలోపేతంగా మారుతుందని ఆసీస్ భావిస్తోంది. మరోవైపు స్మిత్ తిరిగి ఫామ్లోకి రావాలని ఎదురుచూస్తోంది. ఇటీవల సిడ్నీ వేదికగా జరిగిన వన్డేల్లో స్మిత్ వరుస శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్టులో స్మిత్ తన లయను అందుకుంటాడని ఆశిస్తోంది. ఇక ఆసీస్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది. కొత్త బంతితో స్టార్క్, ప్యాటిన్సన్, హేజిల్వుడ్ ఎంతో ప్రభావం చూపగలరు. లైయన్ కూడా సిడ్నీ పిచ్పై సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు.
జట్టు వివరాలు
భారత్: అజింక్య రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, విల్ పకోస్కీ, మార్కస్ హారిస్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, లబుషేన్, ట్రేవిస్ హెడ్, హెన్రిక్స్, టిమ్ పైన్ (కెప్టెన్), కమిన్స్, గ్రీన్, సీన్ అబాట్, లైయన్, స్టార్క్, స్వెప్సన్, హేజిల్వుడ్, ప్యాటిన్సన్, మైకేల్ నెసర్
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్ పరుగుల తేడాతో విజయం సాధించింది. -
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్