David Warner: క్రికెట్కు వీడ్కోలు చెప్పేలోపు.. భారత్ని ఓడించాలి : డేవిడ్ వార్నర్
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే లోపు భారత జట్టుని సొంతగడ్డపై ఓడించాలని ఉందని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. అలాగే, 2023లో ఇంగ్లాండ్లో జరుగనున్న యాషెస్ టెస్టు...
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే లోపు భారత జట్టుని సొంతగడ్డపై ఓడించాలని ఉందని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. అలాగే, 2023లో ఇంగ్లాండ్లో జరుగనున్న యాషెస్ టెస్టు ఛాంపియన్షిప్లోనూ ఆసీస్ను విజేతగా నిలపాలని.. ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలు ఇవేనని చెప్పాడు.
‘మేం భారత జట్టుని సొంత గడ్డపై ఇప్పటి వరకు ఓడించలేకపోయాం. నేను క్రికెట్కు వీడ్కోలు పలికే లోపు టీమ్ఇండియాను సొంత గడ్డపై ఓడించాలని ఉంది. ఇంగ్లాండ్లో కూడా సిరీస్ సాధించలేకపోయాం. 2019లో జరిగిన టెస్టు సిరీస్ను డ్రాగా ముగించాం. ఆయా దేశాల్లో మరోసారి ఆడే అవకాశం వస్తే.. చరిత్ర సృష్టించాలని ఉంది. ప్రస్తుతం నేను అత్యుత్తమ ఫామ్లో ఉన్నాను. కాబట్టి, వచ్చే ఏడాది కూడా ఇలాగే రాణించాలనుకుంటున్నాను. వయసు మీద పడుతున్న ఆటగాళ్లందరూ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జట్టుకోసం మెరుగ్గా రాణిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటాను. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే’ అని డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ను ఇంకా రెండు టెస్టులు మిగిలుండగానే 3-0 తేడాతో ఆసీస్ ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
సొంత గడ్డపై మెరుగ్గా రాణించే డేవిడ్ వార్నర్కి.. భారత్పై రికార్డు మాత్రం చాలా పేలవంగా ఉంది. ఇప్పటి వరకు భారత్లో ఆడిన 8 టెస్టు మ్యాచుల్లో.. 24 సగటుతో 388 పరుగులు చేశాడు. ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోయాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్